ఉత్తర ప్రదేశ్ లో మహిళా కానిస్టేబుళ్ల చేసిన నిర్వాకంపై తీవ్ర విమర్శలు వచ్చిపడుతున్నాయి. ఓవైపు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఓ యాసిడ్ బాధితురాలు, మరోపక్క చిరునవ్వులు చిందిస్తూ సెల్ఫీ తీసుకుంటూ ముగ్గురు మహిళా కానిస్టేబుళ్లు. దీనిపై తీవ్ర దుమారం రేగుతోంది.
యూపీకి చెందిన ఓ గ్యాంగ్ రేప్ బాధితురాలు 8 ఏళ్లుగా న్యాయం కోసం పోరాడుతోంది. తన పిల్లలను కలిసేందుకు ఊంచహార్ కు వెళ్తున్న ఆమెపై గురువారం మరోసారి దాడి చేసి బలవంతంగా యాసిడ్ తాగించారు. చావు బ్రతుకుల మధ్య ప్రస్తుతం ఆ యువతి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. విషయం తెలిసిన సీఎం యోగి ఆదిత్యానాథ్ శుక్రవారం స్వయంగా వెళ్లి బాధితురాలిని పరామర్శించి, ఆమె కుటుంబ సభ్యులను ఓదార్చాడు కూడా. కేసులో ఇప్పటివరకు ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
అయితే సీఎం వెళ్లిపోయాక అక్కడే ఉన్న మహిళా కానిస్టేబుళ్లు సరదాగా అక్కడ కూర్చుని సెల్ఫీలు దిగారు. దీనిపై ఆగ్రహాం చెందిన అధికారులు వారిని సస్పెండ్ చేసి, విచారణకు ఆదేశించారు. కాగా, యాసిడ్ దాడి బాధితులకు ఉద్యోగాలు కల్పించే కేఫ్ లో బాధితురాలు పనిచేస్తోంది. తాము పేదవారిమని, కానీ భార్య మీదున్న నమ్మకంతోనే కేసులో ఇంకా పోరాడుతున్నానని, ఇంతలోనే ఇలా జరిగిందని బాధితురాలి భర్త వాపోతున్నాడు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more