రాష్ట్రానికి అన్యాయం జరిగింది కాంగ్రెస్ దారుణంగా మోసం చేసింది.. కొబ్బరికాయ కొట్టినట్టుగా రెండు ముక్కలు సమానాంగా కొట్టకుండా ఇష్టానుసారంగా రాష్ట్రాన్ని విభజించి.. అంధ్రకు అన్యాయం చేసిందని ఎన్నికలకు ముందు, మరోలా చెప్పాలంటే ఎన్నికల తరువాత కూడా కాంగ్రెస్ ను నిందించి పబ్బం గడుపుకోవాలని యత్నించిన నవ్యాంధ్రలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం అరోపణలు గుప్పించింది. హైదరాబాద్ ను అభివృద్ది చేసినట్లుగానే నవ్యాంధ్రను కూడా అభివృద్ది చేయాలంటే తమ పార్టీనే గెలిపించాలని అన్నారు.
ఇక అటు వెంకయ్యనాయుడు, ఇటు మోడీలను వెంటబెట్టుకుని రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలంటూ కేంద్రంలో బీజేపి, రాష్ట్రంలో టీడీపీ రావాల్సిన అవశ్యకత వుందన్నారు. ఇబ్బడిముబ్బడిగా హామీలను గుప్పించారు. అనుకున్నట్లుగానే అధికారంలోకి వచ్చారు. అయినా విభజన పాపం మొత్తాన్ని కాంగ్రెస్ తలపైనే నెట్టారు. అధికారంలోకి వచ్చిన కొన్నాళ్లలోనే రాష్ట్రానికి ప్రత్యేకహోదాపై కేంద్రం క్లారిటీ ఇచ్చేసింది. దీంతో కేంద్రంతో గొడవ పెట్టుకుంటే వచ్చే నిధులు కూడా రావని భావించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇక కేంద్రం అడుగులకు మడుగులు ఒత్తతూ వారు చెప్పినట్టల్లా అడుతుంది.
ప్రత్యేక ప్యాకేజీ అంటూ కొత్తపాటను అందుకుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికైన ప్యాకేజీని పక్కనబెట్టి .. హోదా కోసం పాటుబడదాం.. అందుకు అసెంబ్లీ తీర్మణా చేసి పంపుదా అన్న వైసీపీ డిమాండ్ ను కూడా తోసిపుచ్చింది. మీరు ఎలాగో చేయరు.. కనీసం చేసేవారితో ఎందుకు కలసిరారు అన్న వైసీపీ డిమాండ్ పై అధికార పార్టీకి చెందిన శాసనసభ వ్యవహారాల శాఖా మంత్రి యనమల రామకృష్ణుడు స్పందిస్తూ.. ప్రత్యేక హోదా వద్దు గురూ.. ప్యాకేజీయే సో బెటరు అంటూ కొత్త రాగం అలపించి క్లారిటీ ఇచ్చారు.
హోదాపై ప్రభుత్వం ఇప్పటికే స్పష్టత ఇచ్చిందని అన్నారు. హోదాతో పొందే లాభాలకన్నా ఎక్కువ ప్రతిఫలం ప్యాకేజీతో దక్కనుందని, విపక్షాలు రాజకీయం చేయడం కోసమే కేంద్రం క్లారిటీ ఇచ్చిన ఈ అంశాన్ని మళ్లి మళ్లీ ప్రస్తావిస్తున్నాయని ఆరోపించారు. హోదా కోసం చర్చ అనవసరమని, ఈ అంశంపై మాట్లాడేందుకు ఏమీ లేదని అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాదని కేంద్రం తేల్చి చెప్పిందని, అందువల్లే అంతకు మించిన సహాయాన్ని పొందేందుకు తాము కృషి చేస్తున్నామని అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more