భారత భూభాగంలోకి అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్ ప్రవేశించిందా..? అన్న అందోళన ప్రజల్లో రేకెత్తగా, అలాంటిదేమీ లేదని పోలీసులు వివరణ ఇచ్చినా.. ఇప్పుడు ఆ సందేహాలకు బలం చేకూరుతుంది. తాజాగా ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా పేరుతో వెలసిన పోస్టర్లే ఈ అనుమానాలను బలోపేతం చేస్తున్నాయి. బిహార్ యువతను ఐసిస్ లో చేరాలని ఆహ్వానిస్తూ పోస్టర్లు వెలువడం కలకలం రేపింది. బిహార్ సహస్రా జిల్లాలోని నౌహట్టా ప్రాంతంలో ఈ పోస్టర్లు దర్శనమిచ్చాయి.
ఐసిస్ పోస్టర్లలో ముఖాలకు మాస్క్ పెట్టుకున్న ఉగ్రవాదుల ఫొటోలు, ఐసిస్ అని అంగ్లంతో పాటు ఉర్దూలో కూడా రాసి వుంది. ఇక కింది బాగంలో మాత్రం అంగ్లంలో ఐసిస్ ఉగ్రవాద సంస్థలో చేరేందుకు ముందుకురావాలంటూ అంగ్లంలో రాసి వుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన నౌహట్టాలోని మూడు విద్యుత్ స్తంభాలకు అంటించారు. ఐసిస్ పోస్టర్ల నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు వీటిని ఎవరు అతికించారు. ఎక్కడ ప్రింటింగ్ చేశారన్న కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.
ఈ ప్రాంతంలో భద్రతపరమైన అలర్ట్ జారీచేశామని, పోస్టర్లు ఎవరు అంటించారనే దానిపై దర్యాప్తు ప్రారంభించామని పోలీసులు తెలిపారు. ఈ పోస్టర్ల గురించి స్థానిక గ్రామస్తులు సమాచారం ఇచ్చారని, వీటిని తాము స్వాధీనం చేసుకున్నామని, కరుడుగట్టిన నేరగాళ్ల హస్తం ఈ పోస్టర్ల వెనుక ఉన్నట్టు అనుమానిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఇటీవల ఉత్తరప్రదేశ్ లక్నోలో ఇద్దరు ఐసిస్ అనుమానిత ఉగ్రవాదుల్ని పోలీసులు ఎన్కౌంటర్ చేసిన సంగతి తెలిసిందే.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more