గోవా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(జీపీసీసీ) అధ్యక్షుడు లుయిజినో ఫలీరో శుక్రవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ దిగ్విజయ్ సింగ్, గోవా స్క్రీనింగ్ కమిటీ చీఫ్ కేసీ వేణుగోపాల్ ఆలసత్వం మూలంగానే గోవాలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు అవకాశం కోల్పోయామని ఆయన ఆరోపించాడు. మరోపక్క ముఖ్యమంత్రి పదవి కోసం కాంగ్రెస్లో రచ్చకెక్కిన విభేదాల కారణంగానే ఈ పరిణామాలు జరిగాయాని చెప్పటం విశేషం.
గోవా ఫార్వర్డ్ నేత విజయ్ సర్దేశాయ్, మరో స్వతంత్ర్య ఎమ్మెల్యే రోహన్ కౌంటే తమకు దారుణంగా మోసం చేశారని చెప్పుకొచ్చాడు. ఎన్నికలకు ముందే వారు బీజేపీతో లోపాయికారి ఒప్పందం చేసుకున్నారని ఆరోపించాడు. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన ఎమ్మెల్యే మద్ధతు కూడగట్టుకున్నాం. ఈ దశలో సీఎం ఎవరన్నదానిపై వివాదం రాజుకుంది. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ తో ఫోన్ లో మాట్లాడాక ఒకానోక దశలో తాను సీఎం పదవి త్యాగానికి సిద్ధమయ్యాను కూడా.
ఇక గవర్నర్ ఆహ్వానం కోసం ఎదురుచూద్దామని దిగ్విజయ్ సింగత్ తనతో చెప్పారని, అందుకే వేచి చూడాల్సి వచ్చిందన్నారు. ఫలితాలు వచ్చిన రోజు రాత్రి కూడా పోర్వోరిమ్ ఎమ్మెల్యే రోహన్ ఖాంటే, బెనాలిమ్ ఎన్సీపీ ఎమ్మెల్యే చర్చిల్ అలేమావో సహా మరో ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు కాంగ్రెస్కు మద్దతు ప్రకటించారని, దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మద్దతు లభించిందని లుయిజినో వివరించారు. అయితే వారి నుంచి సంతకాలు తీసుకోకపోవటం, ఈలోగా బీజేపీ చేయాల్సిన కార్యక్రమాన్ని పూర్తి చేసిందన్నారు. ఈ విషయంలో తాను ఎవరినీ
వేలెత్తి చూపాలని అనుకోవడం లేదని లుయిజినో పేర్కొనటం విశేషం.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more