హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో రోహిత్ వేముల ఆత్మహత్య ఘటనను మర్చిపోకముందే.. అదే తరహా ఘటన ఢిల్లీలోని జవహార్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో చోటుచేసుకోవడం కలకలం రేపగా, సదరు విద్యార్థి అంత్యక్రియలకు హాజరైన కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్ నిరసన సెగ ఎదురైంది. ఆయన సొంత రాష్ట్రంలో తమిళనాడులోని సేలంలో జరిగిన జేఎన్ యూ దళిత పరిశోధక విద్యార్థి ముత్తుకృష్ణన్ అంత్యక్రియలకు హాజరైన ఆయనపై ఆంగతకుడొకరు చెప్పు విసిరాడు. అది ఆయనకు కొంతదూరంలో పడింది. దీంతో అప్రమత్తమైన ఆయన సెక్యూరిటీ ఆయనకు రక్షణగా నిలిచారు.
జేఎన్యూలో సమానత్వానికి చోటులేదని పేర్కొంటూ ముత్తుకృష్ణన్ ఆత్మహత్య చేసుకున్నాడు. కుల వివక్షకు మరో విద్యార్థి బలయ్యాడన్న ప్రచారంతో తమిళనాట ఆగ్రహ జ్వాలలు రేగాయి. కుల వివక్షతో ఓ ప్రొఫెసర్ పెడుతున్న వేధింపులు తట్టుకోలేకే ముత్తుకృష్ణన్ బలవన్మరణానికి పాల్పడ్డాడని తమిళ అభిమాన సంఘాలు, పార్టీలు ఆరోపించాయి. ముత్తుకృష్ణన్ మృతిపై న్యాయ విచారణ జరపాలని సేలంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. విద్యార్థి సంఘాలు చెన్నైలోని బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించాయి.
రోహిత్ వేముల ఆత్మహత్య ఘటనలో ఓ మేధావి ఆత్మహత్య అన్న కోణంలో అలోచించకుండా ఓ విద్యార్థి దళితుడా..? కాదా అన్న కోణంలో దానిని పక్కదారి పట్టించిన ఘటనపై ఇప్పటికే దళిత సంఘాలు అగగ్ిమీద గుగ్గిలంలా మండిపడుతున్నాయి. ఈ క్రమంలో మత్తుకృష్ణన్ మరణం కూడా అలాగే కేంద్ర మానవ వనరుల శాఖ పక్కదారి పట్టిస్తుందని, అసలు దళిత విద్యార్థులు అత్మహత్యల దిశగా ప్రేరేపిస్తున్న కారణాలను విశ్లేషించడంలో అప్పటి సంబంధిత శాఖ మంత్రి స్మృతి ఇరానీ, ఇప్పటి మంత్రి ప్రకాష్ జావదేకర్ కూడా అసక్తి కనబర్చడం లేదని కూడా దళిత సంఘాలు అరోపిస్తున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more