రెండేళ్ల క్రితం ఏపీ అసెంబ్లీ సాక్షిగా పెద్ద ఎత్తున్న దూషణల పర్వమే జరిగింది. ఇందులో భాగంగా టీడీపీ నేత, విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వరరావు వైసీపీ సభ్యులను ఉద్దేశించి కాస్త ఘాటైన వ్యాఖ్యలే చేశాడు. ప్రతిపక్ష నేత జగన్ 420 అని, కొడాలి నాని మరియు ఫైర్ బ్రాండ్ రోజాను ఐరెన్ లెగ్ లుగా అభివర్ణించారు. అంతటితో ఆగకుండా రోజా ఆంటీ సభలో తీవ్ర గందరగోళం రేపుతుందంటూ వ్యాఖ్యానించాడు. దీనిపై రోజా బొండా ఏమైనా కుర్రాడు అనుకుంటున్నాడా? అంటూ అదే స్థాయిలో కౌంటర్ వేసిందనుకోండి.
అయితే తాను గతంలో రోజాపై చేసిన వ్యాఖ్యలపై ఉమ ఇప్పుడు వివరణ ఇచ్చుకున్నాడు. గురువారం ఉదయం అసెంబ్లీకి వెళుతున్న సమయంలో బొండాను ఈ విషయంపై మీడియా ప్రతినిధులు క్లారిటీ అడిగారు. "మేమేం బూతులు మాట్లాడలేదు. ఆంటీ అనే పదం చాలా గౌరవప్రదమైందని, ఆ అనే పదం రోజాకు పూర్తిగా సరిపోతుందని తెలిపాడు. అయినా నేను ఆంటీ అంటే... నన్ను తిరిగి ఏమైనా అనమనండి, కానీ, మధ్యలో తమ సహచరురాలు అనితను దూషించడం ఏమిటి? ఓ దళిత ఎమ్మెల్యేను నోటికొచ్చినట్టు రోజా దూషించడం సరికాదు" అని ఉమా వివరణ ఇచ్చాడు.
ఇక రోజా సస్పెన్షన్ ప్రస్తావిస్తూ శాసనసభలో రోజాకు ప్రత్యేకమైన చట్టాలు ఏమీ ఉండవని... చట్టం అందరికీ సమానంగానే ఉంటుందని తెలిపాడు. ప్రివిలేజ్ కమిటీ ఎవరి మాటలూ వినదని, సొంతంగా నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పారు. గతంలో క్షమాపణలు చెబుతానన్న రోజా ఆ పని చేయలేదని, అందుకే ప్రివిలేజ్ కమిటీ యాక్షన్ తీసుకుంటుందని తెలిపాడు.
మరో ఏడాది సస్పెన్షన్...
వైసీపీ ఎమ్మెల్యే రోజాపై సభా హక్కుల సంఘం నివేదికను ఏపీ శాసనసభలో ప్రవేశపెట్టారు. మొత్తం 62 పేజీలతో కూడిన నివేదికను ప్రివిలేజ్ కమిటీ సభకు సమర్పించింది. విచారణకు సంబంధించిన అన్ని విషయాలను ఈ నివేదికలో కమిటీ పొందుపరిచింది. రోజాపై ఇప్పటికే ఉన్న సస్పెన్షన్ ను మరో ఏడాది పాటు పొడిగించాలంటూ కమిటీ సిఫార్సు చేసింది. బేషరతుగా క్షమాపణ చెబుతానన్న రోజా... క్షమాపణ చెప్పలేదని నివేదికలో కమిటీ తెలిపింది. విచారణ సందర్భంగా వివిధ సందర్భల్లో భిన్నమైన వాదనలను రోజా వినిపించారని చెప్పింది. అయితే, రోజా సస్పెన్షన్ పై నిర్ణయం తీసుకునే అధికారాన్ని సభకే వదిలేసింది కమిటీ.
(And get your daily news straight to your inbox)
Aug 17 | స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకల వేళ.. ప్రధాని నరేంద్రమోడీ ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సందర్భంగా చేసిన ప్రసంగానికి ఆ మరుసటి రోజున.. బీజేపి పాలిత రాష్ట్రంలోనే తూట్లు పోడిచారు. ప్రధాని మోడీ సోంత రాష్ట్రం... Read more
Aug 17 | జేబులో డబ్బులు పెట్టుకుని తిరిగితే.. ఎవరైనా జేబు దొంగలు కొట్టేస్తారేమో అన్న అందోళన అవసరం లేకుండా.. ఎంచక్కా.. డిజిటల్ పే వచ్చేసింది. ఇక ఎదో ఒకచోట డబ్బు అవసరం అయితే.. అక్కడికక్కడే కనిపించే ఏటీఎంకు... Read more
Aug 17 | మహారాష్ట్రలో ఘోర ప్రమాదం సంభవించింది. మహారాష్ట్రలోని గోండియా జిల్లాలో ఎదురెదురుగా వస్తున్న రెండు రైళ్లు ఢీకొన్నాయి. ఎదురుగా వస్తున్న గూడ్సు రైలును.. అదే మార్గంలో వస్తున్న ప్యాసింజర్ రైలు ఢీకొట్టింది. దీంతో ప్యాసింజర్ రైలులోని... Read more
Aug 17 | మధుమేహ రోగులకు శుభవార్తను అందించారు వైద్యశాస్త్ర పరిశోధకులు. కరోనా మహమ్మారి బారిన పడిన మధుమేహ వ్యాధిగ్రస్తులు దాని నుంచి బయటపడేందుకు మానసికంగా, శారీరికంగానూ చేసిన పోరాటం వల్లే అనేక మంది బతికి బయటపడగా, కొందరు... Read more
Aug 17 | కలియుగ వైకుంఠంగా బాసిల్లుతున్న తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు కరోనా మహమ్మారికి మునుపటి స్థితికి చేరుకుని ఇప్పుడిప్పుడే భక్తులకు ఆలవాలంగా మారుతోంది. ఈ తరుణంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్... Read more