దేశంలోని బ్యాంకుల పెద్దన్న ఆర్బీఐ తాజాగా ఓ నివేదికను ఆర్థిక శాఖకు సమర్పించింది. అందులో మోసగాళ్లకు ఎక్కువ లక్ష్యంగా మారుతున్న బ్యాంకులేవో పేర్కొంది కూడా. ఆ జాబితాలో ప్రైవేట్ బ్యాంకు దిగ్గజం ఐసీఐసీఐ మొదటి స్థానంలో ఉండటం విశేషం. రూ. లక్ష అంతకంటే ఎక్కువ విలువతో కూడిన మోసాలు ఐసీఐసీఐ బ్యాంకులో 455 చోటు చేసుకున్నాయి. అది చాలదన్నట్లు ప్రభుత్వ రంగ దిగ్గజం ఎస్ బీఐ రెండో స్థానంలో ఉండటం కలవరపాటుకు గురిచేస్తోంది.
ఇక ఎస్ బీఐలో ఈ సంఖ్య 429, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంకులో 244, హెచ్ డీఎఫ్ సీ బ్యాంకులో 237 మోసాలు జరిగాయి. ఆర్ బీఐకి బ్యాంకులు అందజేసిన సమాచారం ప్రకారం యాక్సిస్ బ్యాంకులో 189, బ్యాంక్ ఆఫ్ బరోడాలో 176, సిటీ బ్యాంకులో 150 మోసపూరిత ఘటనలు నమోదయ్యాయి. మోసాల కారణంగా నష్టపోయిన విలువ పరంగా చూస్తే ఎస్ బీఐ రూ.2,236 కోట్లు, పంజాబ్ నేషనల్ బ్యాంకు రూ.2,250 కోట్లు, యాక్సిస్ బ్యాంకు రూ.1998 కోట్ల చొప్పున లెక్క తేలింది.
ఈ వివరాలను కేంద్ర ఆర్థిక శాఖకు ఆర్ బీఐ అందించింది. వీటిలో బ్యాంకు సిబ్బంది పాత్ర కూడా ఉందని తెలియచేసింది. ఎస్బీఐలో ఇలా మోసాల్లో పాలు పంచుకున్న ఉద్యోగుల సంఖ్య 64 కాగా, హెచ్ డీఎఫ్ సీ బ్యాంకులో 49 మంది, యాక్సిక్ బ్యాంకులో 35 మంది ఉన్నారు. మొత్తం వివిధ బ్యాంకుల తరఫున 450 మంది సిబ్బంది ఈ విధమైన మోసాల్లో తమ వంతు పాత్ర పోషించారు. ఇక మోసాలకు సంబంధించి మొత్తం 3,870 కేసులు నమోదు కాగా, వాటి విలువ రూ.17,750 కోట్లు. 2016 ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు తొమ్మిది నెలల కాలానికి సంబంధించి ఆర్ బీఐ గణాంకాలు ఇలా ఉండగా, నోట్ల రద్దు తర్వాత ఈ సంఖ్య గణనీయంగా పెరిగినట్లు ఓ అంచనా వేస్తోంది. హ్యకర్లు సులువుగా రక్షణ చర్యలను బ్రేక్ చేయటం, ఖాతాదారులు కాస్త ఏమరపాటుగా ఉండటం, అన్నింటికన్నా ఉద్యోగుల చేతివాటం తదితర కారణాలను అందులో ఆర్బీఐ పేర్కొంది..
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more