లక్నోలో ఠాకూర్ గంజ్ లో మట్టుబెట్టిన ఉగ్రవాది సైఫుల్లా చంపకుండా.. అతడ్ని ప్రాణాలు కాపాడేందుకు పోలీసులు విశ్వప్రయత్నాలు చేశారు. సైఫుల్లా ఉంటున్న ఇంటిని గుర్తించిన ఏటీఎస్ సిబ్బంది, అతను ఇంట్లో ఉన్నాడని నిర్ధారించుకుని చుట్టుముట్టారు. దీనిని గుర్తించిన సైఫుల్లా కాల్పులు ప్రారంభించాడు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది కాల్పులు జరుపుతూ హెచ్చరికలు చేశారు. ఉజ్జయినీ రైలు ప్రమాదం నిందితుడిగా పేర్కొంటూ పలు సూచనలు చేస్తూ లొంగిపోవాలని హెచ్చరించారు. దీనికి అంగీకరించని సైఫుల్లా మళ్లీ కాల్పులు జరిపాడు.
దీంతో సైఫుల్లా సోదరుడికి ఫోన్ చేసిన ఏటీఎస్ అధికారులు విషయం వివరించి లొంగిపోవాల్సిందిగా సూచించాలని కోరారు. దీంతో అతని సోదరుడు లైన్ లో ఉన్నాడని, అతనితో మాట్లాడాలని సూచిస్తూ పోలీసులు తలుపు కిందనుంచి ఫోన్ ను లోపలికి తోశారు. దీంతో తన సోదరుడితో మాట్లాడని సైఫుల్లా తాను భద్రతా దళాలకు లొంగిపోయేది లేదని, బలవ్వాలనుకుంటున్నానని తెలిపాడు. దీంతో భద్రతా దళాలు ముందు భాష్పవాయు గోళాలు, తరువాత పెప్పర్ బాంబులు వేశారు. వాటికి ఎలాంటి వ్యక్తి అయినా బయటకు వస్తారు. కానీ సైఫుల్లా మాత్రం బయటకు రాలేదు.
దీంతో ఇక గత్యంతరం లేని పరిస్థితుల్లో పోలీసులు ఉగ్రవాది సైపుల్లాను తుదముట్టించారు. అనంతరం లోపలికి ప్రవేశించిన పోలీసులకు అతని గదిలో భారీ ఎత్తున ఆయుధాలు, ఐఎస్ఐఎస్ జెండాలు కపించాయి. దీంతో వారు ఆశ్చర్యపోయారు. కాగా, అతనిని సజీవంగా పట్టుకుని ఐఎస్ఐఎస్ తీవ్రవాదుల అసలు ప్లాన్ ఏంటి? ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులుగా ఎంత మంది పని చేస్తున్నారు? వంటి వివరాలు తెలుసుకోవాలని భావించారు. అందుకే చివరి వరకు అతని ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించారు.
ఇదిలావుండగా, మరణించిన ఉగ్రవాది సైపుల్లా మృతదేహాన్ని తీసుకువెళ్లేందుకు అతని తండ్రి నిరాకరించాడు. దేశద్రోహానికి పాల్పడిన వ్యక్తి మృతదేహాన్ని తాను తీసుకువెళ్లలేనని చెప్పాడు. పుట్టిన దేశానికి అన్యాయం చేయమని ఏ మతగ్రంధం చెప్పలేదు.. ప్రాణాలు తీయాలని, హింసను ప్రేరేపించినా ఏ దైవం సహించదని చెప్పుకోచ్చాడు. ఇక సైపుల్లా స్వతహాగా ఉగ్రవాదిగా మారాడని, అంతేకాని అతనికి ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థతో ఎలాంటి సంబంధాలు లేవని పోలీసులు ప్రకటించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more