తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణంపై వున్న అనుమానాలను నివృత్తి చేసేందుకు సిబిఐ చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం ఇవాళ నిరాహార దీక్షకు పూనుకున్నారు. తన మద్దతుదారులైన ఎమ్మెల్యేలతో రాజరత్నం స్టేడియం బయట బుధవారం ఆయన దీక్షను ప్రారంభించారు. తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా అయన అనుయాయువులు, అమ్మ అభిమానులు కూడా ఈ ఒక్కరోజు నిరాహార దీక్షను చేపట్టారు.
అంతకు ముందు మార్చి 1న పన్నీరు సెల్వంకు మద్దతుగా ఉన్న అన్నాడీఎంకే ఎంపీలు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు. జయలలిత మృతిపై విచారణ జరిపించాలని ఆయన్ని కోరారు. ఈ సందర్భంగా రాజ్యసభ ఎంపీ మైత్రేయన్ మాట్లాడుతూ జయలలిత మృతిపై ప్రజలకు సందేహాలు ఉన్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో అమ్మ మరణంపై సిబిఐ అధికారుల చేత విచారణ జరిపించి నిజానిజాలను వెలికి తీయాల్సిన అవసరముందని అమ్మ అభిమానులు కోరుతున్న నేపథ్యంలో పన్నీరు సెల్వం వర్గం నిరాహారదీక్షను చేపట్టారు.
ఇదిలావుండగా, తమిళనాట బలం పుంజుకునేందుకే పన్నీరుసెల్వం నిరాహార దీక్షకు పూనుకున్నట్లు కూడా వార్తలు అందుతున్నాయి. అసెంబ్లీలో బలనిరూపణలో విఫలమైన పన్నీరుసెల్వం వర్గం.. తమిళ నాట ప్రజల్లో తన పట్ల సానుభూతి వుందని నిరూపించుకునేందుకు కూడా ఈ దీక్ష దోహదపడుతుందని.. ఈ క్రమంలోనే ఆయన వర్గం దీక్షకు పూనుకుందని విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యేల మద్దతు లేకున్నా, కేడర్ బలం తన వెంటే అని చాటుకునేందుకు తగ్గట్టుగా ఈ దీక్షల విజయవంతానికి కసరత్తులు చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ దీక్ష సాగనుంది. చెన్నైలో చేపాక్కం వద్ద దీక్ష చేపట్టేందుకు నిర్ణయించినా, పోలీసులు అనుమతి నిరాకరించడంతో ఎగ్మూర్ రాజరత్నం స్టేడియం వద్దకు వేదికను మార్చిన విషయం తెలిసిందే.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more