ఏపీ ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ నేతల్లో కొత్త గుబులు మొదలయ్యింది. అందుకు కారణం అసెంబ్లీలో రోజా, ఇతర ఎమ్మెల్యేల అనుచిత వ్యాఖ్యలు చేయటమే. ఈ విషయంలో అధికారపక్షం వ్యూహం ఏంటో తెలియక వైసీపీ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. ఎమ్మెల్యే రోజాపై మరో ఏడాదిపాటు వేటు వేస్తారా? మరో ఐదుగురు శాసనసభ్యులపై ఎటువంటి నిర్ణయం తీసుకోబుతున్నారు? వారిపైనా కూడా వేటేస్తారా? వంటి ప్రశ్నలు వారిని నేతలను కుదురుగా ఉండనీయడం లేదు.
అసెంబ్లీలో అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వైసీపీ ఎమ్మెల్యే రోజాపై టీడీపీ ఎమ్మెల్యే అనిత స్పీకర్కు ఫిర్యాదు చేయడంతో ఆయన దానిని సభా హక్కుల సంఘానికి పంపారు. ఇందుకు సంబంధించిన నివేదికను సభాసంఘం సిద్ధం చేసింది. రోజా అంశం కనుక అసెంబ్లీలో ప్రస్తావనకు వస్తే ఆమెను మరో ఏడాదిపాటు సస్పెండ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే విషయాన్ని టీడీపీ నేతలు పలుమార్లు బహిరంగంగానే పేర్కొన్నారు. అలాగే వైసీపీకి చెందిన చెవిరెడ్డి భాస్కరరెడ్డి, రాజా, రామకృష్ణారెడ్డి, ముత్యాలనాయుడు, శ్రీనివాసులు తదితరులను కూడా సభాహక్కుల కమిటీ విచారించింది. ఈ మేరకు సిద్ధం చేసిన నివేదికను స్పీకర్కు అందించింది. నేటి సభలో ఆ నివేదికలపై ప్రస్తావన ఉంటుందేమోనన్న గుబులు ఇప్పుడు వైసీపీలో మొదలైంది. అయితే ఏడాది తర్వాత నిన్న కొత్త అసెంబ్లీలో అడుగుపెట్టిన రోజా సస్పెన్షన్ పొడగిస్తే నా తడాఖా చూపిస్తానంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
రోజా సభకు వచ్చి తెలుగుదేశం ఎమ్మెల్యే అనితకు క్షమాపణలు చెప్పాల్సి వుంటుందని, ఎటువంటి షరతులు లేకుండా ఆమె క్షమాపణలు చెప్పాలని మంత్రి యనమల తెలిపాడు. ప్రస్తుతం ఆమెపై అనిత చేసిన ఫిర్యాదుపై సభా హక్కుల కమిటీ నివేదిక రూపొందించిందిదని అని అంటున్నారు. రోజా బేషరతు క్షమాపణ చెప్పిన పక్షంలో, ఆమెపై తుది నిర్ణయం తీసుకునే హక్కును సభాపతికి వదిలివేయనున్నట్టు యనమల స్పష్టం చేశాడు.
గ్రీన్ ఇంకుతో కాసేపు...
వైసీపీలో గ్రీన్ ఇంకు కలకలం రేపింది. విషయం ఏంటంటే... ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా వైఎస్సార్ సీపీ తరపున గంగుల ప్రభాకర్ రెడ్డి, ఆళ్ల నాని సోమవారం నామినేషన్లు దాఖలు చేశారు. అభ్యర్థులను ప్రతిపాదిస్తూ వైసీపీ ఎమ్మెల్యేలు గ్రీన్ ఇంకును ఉపయోగించి సంతకం చేశారు. దీంతో గ్రీన్ ఇంకుతో సంతకం చేసిన తమ నామినేషన్లు చెల్లుతాయో?లేదో?నని కొద్దిసేపు టెన్షన్ ఎక్కువైంది. అయితే చివరికి ఎన్నికల అధికారులు ఆ నామినేషన్లు చెల్లుతాయని ప్రకటించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more