నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించటంలో భాగంగా.. ఖాతాదారులపై కొరడా ఝళిపించేందుకు బ్యాంకులు రెడీ అయ్యాయి. ఈ క్రమంలో లావాదేవీలపై కొన్ని బ్యాంకులు తీవ్ర ఆంక్షలు విధించాయి. నగదు ఉపసంహరణ, జమ.. ఏదైనా సరే నాలుగింటికి మించితే తర్వాత జరిపే ఒక్కో లావాదేవీకి రూ.150 దాకా వసూలు చేయనున్నాయి.
హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, యాక్సిక్ బ్యాంకులు ఇప్పటికే ఈ మేరకు అంతర్గత ఆదేశాలు జారీ చేశాయి. హెచ్ డీఎఫ్ సీ హోం బ్రాంచిలో నెలకు 2 లక్షల రూపాయలు వారి సేవింగ్, శాలరీ అకౌంట్ నుంచి విత్ డ్రా లేదా డిపాజిట్ చేసుకునేందుకు అనుమతించిన బ్యాంకు అంతకు మించి ట్రాన్సాక్షన్ జరిపితే ప్రతి లావాదేవీకి రూ.వెయ్యికి రూ.5 లేదా కనిష్టంగా రూ.150 వసూలు చేయనుంది. అంతకు ముందు ఇది 50,000 రూపాయలుగా ఉన్న విషయం తెలిసిందే. ఇక నాన్ హోమ్ బ్రాంచీల్లో థర్టీ పార్టీ ద్వారా జరపుకునే లావాదేవీకి పాతిక వేల దాకా అవకాశం కల్పించారు. ఆ పరిమితి దాటితే పైన చెప్పిన ఛార్జీలే వసూలు చేయనున్నారు. మైనర్, వృద్ధ ఖాతాదారులకు దీని నుంచి మినహాయింపు ఇచ్చింది.
ఐసీఐసీఐ బ్యాంకు నాలుగు ఉచిత లావాదేవీలు, ఆపై ఛార్జీలు వసూలు చేస్తుండగా, నాన్ హోమ్ బ్రాంచీలకు రోజువారీ 50,000 లావాదేవీకి అనుమతి ఇచ్చింది.క్యాష్ డిపాజిట్ మెషీన్ లలో తొలి లావాదేవీకి ఫ్రీ అవకాశం ఇఛ్చి, ఆపై ఛార్జీలు వసూలు చేయనుంది. యాక్సిక్ బ్యాంకు ఖాతాదారులు 10 లక్షల దాకా డిపాజిట్లు, విత్ డ్రా లేదా తొలి ఐదు ట్రాన్సాక్షన్ లు చేసుకునే వెసులు బాటు కల్పించి, ఆపై ఛార్జీలను బాదనుంది.
ఇక బుధవారం నుంచే ఆయా బ్యాంకులు ఈ కొత్త నిబంధనలను అమల్లోకి వచ్చాయి కూడా. మరోపక్క ప్రభుత్వ రంగ బ్యాంకులు కూడా ఇటువంటి నిబంధనలు విధించే అవకాశం ఉందన్న అనుమానాల నేపథ్యంలో అలాంటిదేం ఉండకపోవచ్చనే ఓ అధికారి స్పష్టం చేశాడు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more