వివాదాల పుట్ట, ఉన్నావో బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచాడు. ముస్లిం సంప్రదాయం ప్రకారం, మరణించిన వారిని సమాధి చేయాలని గుర్తు చేసిన ఆయన, దేశంలో ఉన్న 20 కోట్ల మంది ముస్లింలను సమాధి చేసేందుకు స్థలమెక్కడుందని ప్రశ్నించాడు. వారం క్రితం దేశ ప్రధాని నరేంద్ర మోదీ యూపీ ప్రచారంలో భాగంగా ఓ సభలో ప్రసంగిస్తూ ఖబరస్థాన్-సంస్థాన్ అంటూ వ్యాఖ్యలు చేసి తీవ్ర దూమారం రేపాడు. ఇక ఇప్పుడు సాక్షి మహరాజ్ దానికి కొనసాగింపు వ్యాఖ్యలు చేశాడు.
ఉన్నావోలో జరిగిన ఓ ర్యాలీలో ప్రసంగించిన ఆయన "మీరు ఖబరిస్థాన్ అనండి, శ్మశానం అనండి... అందరినీ సమాధి చేయలేం. హిందువులు మరణిస్తే, స్థలం అక్కర్లేదు. దహన సంస్కారాలు చేస్తే చాలూ. సాధువుల కోసం స్మారకం కావాలి. కానీ, ఇండియాలో 20 కోట్ల మంది ముస్లింలు ఉన్నారు. వారందరినీ ఎక్కడ సమాధి చేయాలి? హిందుస్థాన్ లో అంత భూమి ఎక్కడుంది?" అని ప్రశ్నించాడు. అందుకే మీరు దహన సంస్కారాలకు సిద్ధపడండి అంటూ పిలుపునిచ్చాడు. అయితే దీనిపై తీవ్ర విమర్శలు రావటంతో సర్దిచెప్పుకునే యత్నం చేశాడు. మొత్తం స్మశానాలతో నిండిపోతే రైతులకు పంట పడించేందుకు భూమి ఉండదని, తాను ఆ ఉద్దేశ్యంతోనే తాను ఆ ప్రకటన చేశానని చెప్పుకొచ్చాడు.
అయితే ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో మండిపడింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి సందీప్ దీక్షిత్ స్పందిస్తూ, యూపీ ఎన్నికల్లో మత విద్వేషాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని బీజేపీ భావిస్తోందని, సాక్షి వ్యాఖ్యలు అందుకోసమేనని విమర్శించారు. మరోవైపు మోదీ సమాధి రాజకీయాలపై లాలూ ప్రసాద్ యాదవ్, సీపీఐ పార్టీలు మండిపడ్డాయి. కాగా, నాలుగు వివాహాలు చేసుకొని 40 మందిని కంటున్న వారే దేశంలో జనాభా విస్పోటనానికి బాధ్యత వహించాలని మహరాజ్ గతంలో చేసిన వ్యాఖ్యలు ఆయన్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేశాయి కూడా.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more