తమ సామాజిక వర్గానికి రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తోన్న మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అందుకోసం సీనియర్లతో సహా దాదాపు అందరు కీలక నేతల మద్ధతు కూడగట్టుకుంటున్నారు. అయితే ఇందుకోసం తానెవరి వెంట పడబోనని స్వచ్ఛందంగా ముందుకు వచ్చేవారితోనే కాపు ఐక్య వేదిక కొనసాగుతుందని ప్రకటించాడు ఆయన. కర్నూలులో ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఉద్యమమే ఊపిరిగా బతుకుతున్న తనపై ఎలాంటి ఒత్తిడి వచ్చినాసరే కాపు పోరాటం ఆగదని స్పష్టం చేశాడు.
ఇక 2019 ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపే పార్టీ గా భావిస్తున్న జనసేన, దాని అధినేత పవన్ కళ్యాణ్ గురించి ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కాపు ఉద్యమానికి పవన్ మద్దతు ఇవ్వటం లేదా? అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ... ఆ విషయాన్ని ఆయన్నే అడగాలని సూచించాడు. ఉద్యమంలో పాలు పంచుకున్న వారి గురించే అడగాలని, వారి గురించి చెబుతానే తప్ప దూరంగా ఉండేవారి గురించి అడిగితే తాను చెప్పబోనని ముద్రగడ అన్నాడు. అసలు ఆ ప్రశ్న తనను అడగడం సరికాదని తెలిపాడు.
అదే సమయంలో పాలు పంచుకోని వారిని తాను ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది పెట్టబోనన్న ఆయన పవన్ కలిసివస్తే మంచిదేనన్న రీతిలో వ్యాఖ్యలు చేశాడు. అదే సమయంలో ట్వీట్ల ద్వారానో, మీటింగ్ ల ద్వారానో సమస్యలు పరిష్కారం కావన్న రీతిలో పవన్ కి చురకలంటించటం కొసమెరుపు. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమపై ఎన్నో హామీలు గుప్పించిందని, ఇప్పుడు ఆ విషయమే మరచిపోయిందని ఆయన అన్నారు. తనకు కాపు రిజర్వేషన్లు తప్ప పదవీ మీద ఆశలు లేవని, తమ వర్గానికి న్యాయం జరిగేవరకు పోరాడతానని మరోసారి స్పష్టం చేశాడు. అయితే ఉద్యమానికి మద్ధతు ఇవ్వకుండా పైగా పరోక్షంగా ప్రభుత్వానికి ఫేవర్ గానే మాట్లాడు తమతో కలిసిరాకపోవటం మూలంగానే ముద్రగడ ఇలా మాట్లాడి ఉండొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more