టెలీకమ్యూనికేషన్ రంగంలో టెలికాం సంస్థల ద్వారా తీవ్రమైన పోటీ ఎదర్కోంటున్న వేళ.. రిలయన్స్ వచ్చి అన్యూకరమైన విలీనాలకు తెరతీయడం.. జియో పోటీని తట్టుకోవడానికి టెలికాం సంస్థలు కూడా ప్రత్యేక ఆఫర్లను ప్రకటిస్తూ ముందుకు సాగుతున్నాయి. అయితే టెలికాం రంగం తరువాత అదే తరహా పోటీ ఇప్పుడు దేశీయ విమానయాన రంగంలోనూ నెలకొంది. సీటు కెపాసిటీని పెంచుకోవడంతో పాటు సంస్థలు లాభాలకు వెళ్లకుండా బ్రేక్ ఈవెన్ పాయింట్ కు కొద్దిగా లాభాలను మాత్రమే అలోచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాతో పాటు ప్రైవేటు విమాన సంస్థలు కూడా చౌకధరల యుద్దంలో జోరును ప్రదర్శిస్తున్నాయి.
తాజాగా, ఈ రాయితీ టిక్కెట్ల వార్ లోకి దేశంలోని ప్రముఖ ప్రైవేట్ ఎయిర్ లైన్స్ ఇండిగో కూడా ఎంట్రీ ఇచ్చింది. సరిగ్గా స్పైస్ జెట్ లక్కీ సెవన్ ఆపర్ ను ప్రకటించిన తరువాత అదే తరహాలో ఇండిగో కూడా రాయితీ అఫర్ ను ప్రకటించింది. దేశీయ మార్గాల్లో తగ్గింపు ధరలను బుధవారం ప్రకటించింది. ఎంపిక చేసిన రూట్లలో అన్నీ కలుపుకుని రూ.777రూపాయలకే టిక్కెట్లు ఆఫర్ చేస్తోంది. ఈ ఆఫర్ లో బుకింక్స్ ఫిబ్రవరి 25 వరకు అందుబాటులోఉండనున్నట్టుతెలపింది. అలాగే ఈ టికెట్ల ద్వారా ఏప్రిల్ 27 వరకూ ప్రయాణించే అవకాశం కల్పిస్తోంది. సెలెక్టెడ్ సెక్టార్లో, సెలెక్టెడ్ విమానాలకుమాత్రం ఈ ఆఫర్ పరిమితమని పేర్కొంది.
ఈ తగ్గింపు టికెట్ల ధరలు అగర్తలా-గౌహతి, శ్రీనగర-చండీఘఢ్ మధ్య రూ.777 అందుబాటులో ఉండగా, చెన్నై-హైదరాబాద్ మధ్య రూ. 999గా ఉండనున్నాయి. ప్రయాణానికి 19రోజుల ముందుబుక్ చేసుకోవాల్సి ఉంటుందని తెలిపింది.అలాగే పరిమితమైన సీట్లు అందుబాటులో ఉన్నాయనీ, ఒకవేళ క్యాన్సిల్ చేసుకుంటే చట్టబద్ధమైన పన్నులు మాత్రమే తిరిగి చెల్లించనున్నామని స్పష్టం చేసింది. మరిన్ని వివరాలకు ఇండిగోఎయిర్లైన్స్ అధికారిక వెబ్ సైట్ ను సందర్శించగలరు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more