భారత అర్థిక ఉగ్రవాదిగా విమర్శలను ఎదుర్కోంటూ.. బ్యాంకులకు 9 వేల కోట్లు రూపాయల ఉద్దేశపూర్వక ఎగవేతదారుడిగా అభియోగాలు నమోదైన విజయ్ మాల్యా.. మాట మార్చారు. వేల కోట్లు రూపాయలను తిరిగి చెల్లిస్తానని అందుకు తన న్యాయవాదితో కోర్టులకు చెప్పించిన మాల్యా.. తాను వ్యాపారంలో చాలా కోల్పోయానని, తాను రుణాలు తీసుకున్న అసలులో కొంత భాగం మాత్రం చెల్లిస్తానని, అందుకు బదులుగా తనపై నమోదైన కేసులన్నీంటినీ ఉపసంహరించాలని షరుతు పెట్టి.. తన అస్తులను వేలం వేయించుకున్న మాల్యాను ఎలాగైనా భారత్కు రప్పించాలని ఓ వైపు ఇండియన్ అధికారులు ప్రయత్నాల నేపథ్యంలో తాను మాత్రం బ్రిటెన్ విడచి రానని తేల్చిచెప్పారు.
భారత్ నుంచి పారిపోయారన్న విమర్శలపై తొలినాళ్లలో తీవ్రంగా స్పందించిన మాల్యా.. తాను భారత్ నుంచి పారిపోయానన్న విమర్శలు సరికావని, తాను అరుమాసాల్లో తిరిగి భారత్ కు వస్తానని నమ్మబలికారు. అంతేకాదు తాను పారిపోయిన నేపథ్యంలో కథనాలు రాసిన మీడియాను కూడా ఓ స్థాయిలో హెచ్చరించిన మాల్యా.. తన నుంచి ప్రతికల యాజమాన్యాలు, మీడియ ప్రతినిధులు పోందిన లాభాలను, సాయాలను మర్చిపోరాదని కూడా సూచించారు. అలాంటి మాల్యా ఇప్పుడు తాను నిజంగానే పారిపోయాను.. ఇక బ్రిటెన్ విడచి రాను అని అంటున్నారు.
యూకే చట్టాల కిందే తాను సురక్షితంగా ఉన్నట్టు చెప్పారు. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ రుణాల విషయంలో మోసం, కుట్ర కింద తనపై నమోదైన కేసులను ఆయన కొట్టిపారేశారు. ఒక్క రూపాయిని కూడా దుర్వినియోగంగా ఖర్చుచేయలేదన్నారు. కానీ ప్రభుత్వ రంగ బ్యాంకులు మాత్రం తనని వ్యక్తిగతంగా బాధ్యుడిని చేస్తున్నాయంటూ మండిపడ్డారు. తనను ఎన్నికల ప్రచార సందర్భంగా రెండు అతిపెద్ద పార్టీలు ఓ పొలిటికల్ ఫుట్ బాల్లా ఆడుకుంటున్నాయని ఆరోపించారు. మాల్యాకు సాయం చేశారంటూ ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ ఎన్నికల క్యాంపెయిన్లు నిర్వహిస్తున్నాయని పేర్కొన్నారు.
తన సివిల్ కేసును సీబీఐ ప్రభుత్వ ఉత్తర్వులతో క్రిమినల్గా కేసుగా మార్చిందని ఆరోపించారు. రుణాలు రికవరీ చేసుకోవడం పూర్తిగా సివిల్ అంశం కిందకు వస్తోంది. కానీ ప్రభుత్వ ఉత్తర్వులతో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దాన్ని క్రిమినల్ గా మార్చింది. ప్రతి దాన్ని తాను లీగల్ గా ఛాలెంజ్ చేసే అవకాశముందన్నారు. తనపై వారు ఎలాంటి కేసు పెట్టలేరని తాను విశ్వసిస్తున్నట్టు పేర్కొన్నారు. మరోవైపు మీడియాపై కూడా మాల్యా మండిపడ్డారు. ఫార్ములా 1లోకి ఇండియన్ ఎంట్రీని పొగడాల్సింది పోయి, మీడియా దాన్ని రాద్ధాంతం చేస్తుందని సీరియస్ అయ్యారు. ఇండియన్ మీడియా కామెంట్లు చాలా బాధకరమన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more