భారత అర్థిక ఉగ్రవాదిగా విమర్శలను ఎదుర్కోంటూ.. బ్యాంకులకు 9 వేల కోట్లు రూపాయల ఉద్దేశపూర్వక ఎగవేతదారుడిగా అభియోగాలు నమోదైన విజయ్ మాల్యా.. మాట మార్చారు. వేల కోట్లు రూపాయలను తిరిగి చెల్లిస్తానని అందుకు తన న్యాయవాదితో కోర్టులకు చెప్పించిన మాల్యా.. తాను వ్యాపారంలో చాలా కోల్పోయానని, తాను రుణాలు తీసుకున్న అసలులో కొంత భాగం మాత్రం చెల్లిస్తానని, అందుకు బదులుగా తనపై నమోదైన కేసులన్నీంటినీ ఉపసంహరించాలని షరుతు పెట్టి.. తన అస్తులను వేలం వేయించుకున్న మాల్యాను ఎలాగైనా భారత్కు రప్పించాలని ఓ వైపు ఇండియన్ అధికారులు ప్రయత్నాల నేపథ్యంలో తాను మాత్రం బ్రిటెన్ విడచి రానని తేల్చిచెప్పారు.
భారత్ నుంచి పారిపోయారన్న విమర్శలపై తొలినాళ్లలో తీవ్రంగా స్పందించిన మాల్యా.. తాను భారత్ నుంచి పారిపోయానన్న విమర్శలు సరికావని, తాను అరుమాసాల్లో తిరిగి భారత్ కు వస్తానని నమ్మబలికారు. అంతేకాదు తాను పారిపోయిన నేపథ్యంలో కథనాలు రాసిన మీడియాను కూడా ఓ స్థాయిలో హెచ్చరించిన మాల్యా.. తన నుంచి ప్రతికల యాజమాన్యాలు, మీడియ ప్రతినిధులు పోందిన లాభాలను, సాయాలను మర్చిపోరాదని కూడా సూచించారు. అలాంటి మాల్యా ఇప్పుడు తాను నిజంగానే పారిపోయాను.. ఇక బ్రిటెన్ విడచి రాను అని అంటున్నారు.
యూకే చట్టాల కిందే తాను సురక్షితంగా ఉన్నట్టు చెప్పారు. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ రుణాల విషయంలో మోసం, కుట్ర కింద తనపై నమోదైన కేసులను ఆయన కొట్టిపారేశారు. ఒక్క రూపాయిని కూడా దుర్వినియోగంగా ఖర్చుచేయలేదన్నారు. కానీ ప్రభుత్వ రంగ బ్యాంకులు మాత్రం తనని వ్యక్తిగతంగా బాధ్యుడిని చేస్తున్నాయంటూ మండిపడ్డారు. తనను ఎన్నికల ప్రచార సందర్భంగా రెండు అతిపెద్ద పార్టీలు ఓ పొలిటికల్ ఫుట్ బాల్లా ఆడుకుంటున్నాయని ఆరోపించారు. మాల్యాకు సాయం చేశారంటూ ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ ఎన్నికల క్యాంపెయిన్లు నిర్వహిస్తున్నాయని పేర్కొన్నారు.
తన సివిల్ కేసును సీబీఐ ప్రభుత్వ ఉత్తర్వులతో క్రిమినల్గా కేసుగా మార్చిందని ఆరోపించారు. రుణాలు రికవరీ చేసుకోవడం పూర్తిగా సివిల్ అంశం కిందకు వస్తోంది. కానీ ప్రభుత్వ ఉత్తర్వులతో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దాన్ని క్రిమినల్ గా మార్చింది. ప్రతి దాన్ని తాను లీగల్ గా ఛాలెంజ్ చేసే అవకాశముందన్నారు. తనపై వారు ఎలాంటి కేసు పెట్టలేరని తాను విశ్వసిస్తున్నట్టు పేర్కొన్నారు. మరోవైపు మీడియాపై కూడా మాల్యా మండిపడ్డారు. ఫార్ములా 1లోకి ఇండియన్ ఎంట్రీని పొగడాల్సింది పోయి, మీడియా దాన్ని రాద్ధాంతం చేస్తుందని సీరియస్ అయ్యారు. ఇండియన్ మీడియా కామెంట్లు చాలా బాధకరమన్నారు.
(And get your daily news straight to your inbox)
Mar 02 | తెలంగాణ ఇంటి కోడలినంటూ అదే మెట్టినిల్లు లాజిక్ తో ఇక్కడి రాజకీయాల్లో కొత్త పార్టీతో రంగప్రవేశం చేయునున్న వైఎస్ షర్మిల ఇప్పటికే జిల్లాల ముఖ్యనేతలతో సమావేశాలు నిర్వహించి, సమాలోచనలు జరిపిన విషయం తెలిసిందే. ఇక... Read more
Mar 02 | ఎల్గార్ పరిషద్ కేసులో అరెస్టయిన విరసం నేత వరవరరావుకు బాంబే హైకోర్టులో ఊరట లభించింది. మహారాష్ట్ర బెయిల్ ష్యూరిటీ విషయంలో ఆయన ఎదుర్కోంటున్న ఇబ్బందులను ఆయన తరపు సినియర్ న్యాయవాది ఆనంద్ గ్రోవర్ బాంబే... Read more
Mar 01 | తెలుగురాష్ట్రాల్లో సంచలనంగా మారిన న్యాయవాద దంపతులు గట్టు వామన్రావు, నాగమణి దారుణ హత్యకేసులో పోలీసుల చేతికి కీలక ఆధారాలు లభించాయి. హత్యకు నిందితులు ఉపయోగించిన రెండు కత్తులు సుందిళ్ల బ్యారేజ్లో దొరికాయి. బ్యారేజ్ 53,... Read more
Mar 01 | అత్యచార కేసుల్లో బాధితులను పెళ్లి చేసుకుంటామని హామీ ఇచ్చినా.. లేక మరో విధంగా రాజీ కుదుర్చుకున్నా కేసుల నుంచి మినహాయింపు మాత్రం లభించదని గతంలోనే చెప్పిన దేశసర్వన్నత న్యాయస్థానం ఇవాళ ఓ ప్రభుత్వం ఉద్యోగి... Read more
Mar 01 | కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఏప్రీల్ 6వ తేదీన ఎన్నికల జరగనున్న తమిళనాడులో ఇవాళ బిజీగా పర్యటించారు. ఇటీవల కేరళలోని కోల్లా జిల్లాలో మత్స్యకారులతో కలసి చేపల వేటకు సముద్రంలోకి వెళ్లిన రాహుల్.. వారితో... Read more