బ్రాండ్ అంబాసిడర్ గా ఉండటమే తనకు కోట్ల ఆస్తితో సమానమన్న పవన్ తెలుగు రాష్టర్ ప్రభుత్వాలు చేనేతకు అండగా ఉంటానని మాటల్లో చెప్పటం కాదని, ఆచరించి చూపాలంటూ చెప్పాడు. నేతలు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై మోనటరింగ్ కమిటీ ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. ఈ సంఘాలు నిష్పాక్షికంగా ప్రభుత్వాలు తమకు ఏం చేశాయో చెప్పాలని సూచించారు. చీర నేసే కష్టాన్ని తాను ఇప్పుడే చూశానని, అద్భుతమైన ప్రతిభ దాగి ఉన్న చేనేతను ప్రోత్సహించాలని ఆయన చెప్పారు. ఈ మేరకు నగదు బహుమతులు ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.
చేనేత వాడుతున్నందుకు తాను గర్వంగా ఫీలవుతున్నానన్న వపన్ వారంలో ప్రతీ ఒక్కరూ చేనేత ధరించాలని మరోసారి పిలుపునిచ్చాడు. రాజకీయాలంటే మురికి కుంపలు అంటూ కొందరు తనను ఎందుకు వచ్చావయ్యా అంటూ ప్రశ్నించారని, కానీ, లోపల నిర్మలంగా ఉన్న తాను మురికిలోకి వెళ్లినా స్వచ్ఛంగా బయటికి రాగలనంటూ చెప్పుకొచ్చాడు. చేత కానప్పుడు హామీలు ఇవ్వటం సరికాదన్న వపన్ మరోసారి ప్రత్యేక హోదాపై గళం విప్పాడు. ముందు స్టేటస్ తర్వాత ప్రత్యేక ప్యాకేజీ అని మాట మార్చాల్సిన అవసరం ఏమోచ్చిందని కేంద్రాన్ని ప్రశ్నించాడు.
2019 ఎన్నికల్లో జనసేన ఖచ్ఛితంగా పోటీ చేస్తుందని ప్రకటించిన పవన్, తాను కూడా బరిలో నిలవనున్నట్లు మరోసారి స్పష్టం చేశాడు. అంతేకాదు గెలిచాక అసెంబ్లీలో చేనేత తరపున గొంతుక వినిపిస్తానని పవన్ ప్రకటించటం విశేషం. ఇక ప్రజలు చిత్తశుద్ధి కలిగిన నాయకత్వాన్ని కోరుకుంటున్నారని, పలువురు నేతలు తనతో కలిసి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ, కష్టాలకు నెవరని నేతల కోసం తాను చూస్తున్నట్లు తెలిపాడు. ఇక ఎర్ర తుండువాను ధరించిన పవన్ ఇది సినిమాకు సంబంధించింది కాదని, కుల, వర్ణ, మత, బేధాలకు సంబంధం లేకుండా దీనిని ధరిస్తారంటూ తెలిపాడు. చేనేత రంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్న జనసేన అధినేత చేనేత కార్పోరేషన్ ఏర్పాటు డిమాండ్ ను బలంగా వినిపించాడు.
తాను కేవలం చేనేత కార్మికులకే కాదని, స్వర్ణ కారులకు కూడా అండగా ఉంటానంటూ ప్రకటించాడు. అన్ని రంగాల వారిని ఆదుకునేందుకు ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలని, గ్రాంట్స్ కోరాలంటూ డిమాండ్లు తమ ముందుకు వచ్చాయని, మార్చి 14న జనసేన వెబ్ సైట్ ను ప్రారంభిచబోతున్నామని తెలిపిన పవన్, వాటిని పరిశీలించి జనసేన భవిష్యత్ పోరాటం నిర్ణయిస్తుందని చెబుతూ భారత్ మాతాకీ జై, జై హింద్ నినాదాలతో ప్రసంగం ముగించాడు.
(And get your daily news straight to your inbox)
Apr 03 | ఉత్తరప్రదేశ్ లో జరగనున్న పంచాయతీ ఎన్నికలు ఈసారి గ్లామరెస్ గా మారనున్నాయి. తాను పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు ఫెమినా మిస్ ఇండియా -2015 రన్నరప్ దీక్షాసింగ్ ప్రకటించింది. జౌన్ పూర్ జిల్లా బక్షా... Read more
Apr 03 | ఎనబై ఏళ్లకు పైబడిన వయస్సులోనూ అమె తన జీవనం కోసం అలోచించకుండా పది మంది కడుపు నింపే పనికి పూనుకున్నారు. అందరూ తన బిడ్డల లాంటి వారేనని, అమె అందరికీ అందుబాటు ధరలోనే ఇడ్లీలు... Read more
Apr 03 | బెంగళూరు డ్రగ్స్ కేసు..శాండిల్ వుడ్ పరిశ్రమను షేక్ చేసి అక్కడి ప్రముఖులను ఊచలు లెక్కపెట్టించిన కేసుకు సంబంధించిన లింకులు తెలంగాణలోనూ బయటపడ్డాయి. ఆ మధ్య పలువురు నటుల చు్ట్టూ తిరిగిన ఈ కేసులో వారి... Read more
Apr 03 | అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్న అసోంలో బీజేపీకి దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. అసోం బీజేపి ప్రతినిధిగా ముఖ్యమంత్రి సోనూవాల్ ను అధిగమించి మరీ దూసుకుపోతున్న రాష్ట్ర మంత్రి హిమంత విశ్వశర్మపై చర్యలు తీసుకున్నఎన్నికల కమీషన్... Read more
Apr 03 | తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం అంకానికి మరికొన్ని గంటల వ్యవధిలో తెరపడుతుందన్న తరుణంలో రాజకీయ పార్టీల మధ్య విమర్శలు ప్రతివిమర్శలు, అరోపణలు ఊపందుకుంటున్నాయి. మరీముఖ్యంగా బీజేపిని టార్గెట్ చేస్తున్న ప్రతిపక్ష పార్టీ డీఎంకే అధినేత... Read more