తమిళనాడు కొత్త ముఖ్యమంత్రిగా పళనిస్వామి.. మంత్రులు వీరే.. Palaniswami is new Tamil Nadu Chief Minister

Palaniswami is new tamil nadu chief minister 30 other aiadmk leaders take oath at raj bhavan

Tamil Nadu, chief minister, late cm J Jayalalithaa, VK Sasikala, disproportionate case, Palanisamy, , Bengaluru, O.Panneerselvam, supreme court, vidyasagar rao, PM modi, Governor, tamil politics

Edapaddi Palanisamy sears-in as new chief minister of tamilnadu, in the presence of Governor Ch Vidyasagar Rao, along with 30 members of his cabinet

తమిళనాడు కొత్త ముఖ్యమంత్రిగా పళనిస్వామి.. మంత్రులు వీరే..

Posted: 02/16/2017 04:07 PM IST
Palaniswami is new tamil nadu chief minister 30 other aiadmk leaders take oath at raj bhavan

తమిళనాడు సీఎంగా శశికళ వర్గం నేత పళనిసామి ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ భవన్ లో తమిళనాడు కొత్త ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణం స్వీకారం చేశారు గవర్నర్ విద్యాసాగర్ రావు. పళనిసామితో పాటు మంత్రులతో కూడా ప్రమాణం చేయిందచారు. అయితే మఖ్యమంత్రి చేత ప్రత్యేకంగా ప్రమాణస్వీకారం చేయించిన ఆయన.. మంత్రుల చేత మాత్రం మూకుమ్మడిగా ప్రమాణస్వీకారం చేయిందారు.

అయితే మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన వారిలో దాదాపుగా పాత ముఖాలే వున్నాయి. వీరందరూ జయలలిత హయాంలోనూ మంత్రులుగా బాధ్యతలు నిర్వర్తించిన వారే కావడం గమనార్హం. అయితే పన్నీర్ సెల్వం, పాండయరాజన్ తప్ప…గత కేబినెట్ లో ఉన్న మిగతా అందరికీ అవకాశం కల్పించారు పళనిసామి. సెంగొట్టియాన్ కు కొత్తగా కేబినెట్ లో స్థానం కల్పించారు. పాండియరాజన్ స్థానంలో ఆయనకు స్థానం దక్కింది. కాగా పన్నీరు సెల్వం స్థానాన్ని మరెవరితోనూ భర్తీ చేయలేదు.

పళనిసామి కొత్త మంత్రివర్గం ఇదే..

ముఖ్యమంత్రి : కే  పళనిసామి (హోం, ఆర్థిక, రెవెన్యూ, పరిపాలన శాఖలు)
అటవీశాఖ మంత్రి : సీ శ్రీనివాసన్
యువజన, స్పోర్ట్స్, విద్యాశాఖ మంత్రి: కే ఏ సెంగొట్టియన్
సహకార శాఖ మంత్రి: కే రాజు
ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ: తంగమణి
మున్సిపల్ అండ్ గ్రామీణ శాఖ: ఎస్పీ వేలుమణి
మత్స్యశాఖ మంత్రి: జయకుమార్
న్యాయశాఖ మంత్రి: ఎస్ షణ్ముఖం
ఉన్నతవిద్యాశాఖ మంత్రి: కేపీ అన్బలగన్
సోషల్ వెల్పేర్ శాఖ: వీ సరోజ
M.C.సంపత్…పరిశ్రమల శాఖ,
K.C. కరుప్పనన్…పర్యావరణ శాఖ,
R.కామరాజ్…పౌర సరఫరాలు,
O.S.మణియన్…జౌళి శాఖ,
K.రాధాకృష్ణన్…పట్టణ, గృహనిర్మాణ శాఖ,
G.భాస్కరన్…ఖాదీ, గ్రామీణ పరిశ్రమల బోర్డు, S.రామచంద్రన్…దేవాదాయ శాఖ,
S.వలర్మతి…వెనకబడిన తరగతులు, మైనారిటీ సంక్షేమం,
P. బాలకృష్ణారెడ్డి…పశుసంవర్ధక శాఖ,
C. విజయభాస్కర్…వైద్య, కుటుంబ సంక్షేమం,
R. దొరల్ కున్ను.. వ్యవసాయం,
కడంబూర్ రాజు…సమాచార, ప్రసారాలు,
R.B. ఉదయ్ కుమార్…రెవెన్యూ,
N. నటరాజన్…టూరిజం,
K.C. వీరమణి.. వాణిజ్య పన్నులు,
రాజేంద్ర బాలాజీ…పాల ఉత్పత్తుల, డెయిరీ అభివృద్ధి,
P. బెంజిమెన్…గ్రామీణ పరిశ్రమలు,
నీలోఫర్ కఫీల్, కార్మికశాఖ,
MR విజయభాస్కర్…రవాణాశాఖ,
M. మనికందన్…ఐటీ శాఖ,
V.M. రాజలక్ష్మి, ఆదిద్రవిడ, గిరిజన సంక్షేమ శాఖలు కేటాయించారు.
మొత్తంగా 31 మందితో పళనిస్వామి క్యాబినెట్ కోలువుదీరనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : J Jayalalithaa  VK Sasikala  Palanisamy  panneerselvam  vidyasagar rao  governer  AIADMK  tamilnadu  

Other Articles