నిట్టనిషీధిలో కూడా జనసంచారం వుండే ప్రాంతం ఏదైనా వుందంటే అదే మాదాపూర్. వేలకోద్ది సాఫ్ట్ వేర్ సంస్థలు.. రాత్రింబవళ్లు ఉద్యోగులు సంచరించే మాదాపూర్ లో రాత్రికి, పగలుకు తేడా లేదు. కానీ అలాంటి ప్రాంతంలో దారుణం చోటుచేసుకోవడం కలకలం రేపుతుంది. ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగినిని దుండగులు దారుణంగా హతమార్చాడం పెను సంచలనంగా మారింది. సాఫ్ట్ వేర్ సంస్థల ఉద్యోగులు నిబ్బరంగా వుండే ప్రాంతంలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం తోటి హైటెక్ టెక్కల గుండెల్లో అందోళన రేపుతుంది.
మాన్ స్టర్.కామ్లో పనిచేస్తోన్న సునీత అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్ నిన్న ఉదయం ఇంటి నుంచి ఆఫీసుకి బయలుదేరింది. అయితే, మళ్లీ సాయంత్రం ఆమె ఇంటికి చేరుకోలేదు. ఇంతలో మాదాపూర్లో నిర్జన ప్రాంతంలో ఓ మృతదేహాం వుందని పోలీసులకు సమాచారం అందింది. అయితే అమె మృతదేహాన్ని అప్పటికే సగం మేర కాల్చివేశారు దుండగులు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు అమె మృతదేహాన్ని పరిశీలించి అధారాలు సేకరించారు. వెంటనే సునీత తల్లిదండ్రులను పిలపించారు.
ఆ మృతదేహం తమ బిడ్డ సునీతదేనని గుర్తించిన కుటుంబ సభ్యులు శోకసంధ్రంలో మునిగారు. తమకు శత్రువులు లేరని ఆమె కుటుంబ సభ్యులు చెబుతున్నారు. సునీతను దారుణంగా చంపి కాల్చేసిన వారు ఆమెకు తెలిసిన వారేనా? లేక ప్రేమ వ్యవహారమే అమె హత్యకు కారణమా..? లేక గుర్తుతెలియని దుండగులు ఆమెపై దారుణానికి ఒడిగట్టారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దుండగుల కోసం పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more