తమిళనాట రాజకీయాలు క్షణక్షణం ఉత్కంఠ రేపుతూ మారిపోతున్నాయి. ప్రజల్లో అంతకంతకూ అసక్తిని రేపుతూ.. ఎవరు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తారన్న విషయమై అందరిలోనూ ఉత్కంఠ పెరుగుతుంది. అయితే ఇన్నాళ్లు అమ్మ చేతిలో రిమోట్ గా వున్న పన్నీరు సెల్వం.. తాను రిమోట్ మాత్రమే కాదు పార్టీని కాపాడుకునే తరుణంలో.. అమ్మ ఆశయాల సాధనలో చిన్న పాటి బాంబు అని కూడా తేల్చేశారు. అమ్మ తరువాత చిన్నమ్మ అని అందరూ పాట పాడుతున్న తరుణంలో పార్టీ కోశాధికారిగా ఆయనపై వేటు వేయగానే చిన్నమ్మపై తన వ్యతిరేక వైఖరిని బయటపెట్టారు.
ఎమ్మెల్యేల మద్దతు తనకే వుందంటూ పన్నీర్ సెల్వం ధీమా వ్యక్తం చేస్తున్నారు. గవర్నర్ విద్యాసాగర్ రావు బలనిరూపణకు అవకాశమిస్తే తన బలాన్ని చూపుతానని నమ్మబలుకుతున్నారు. ఇవాళ గవర్నర్ చెన్నైకి రానున్నారని సమాచారం వుండటంతో ఇక రాజ్ భవన్ పైపు ఎలాంటి నిర్ణయం తీసుకోనుందని అందరి దృష్టి అటు వైపే వుంది. ఈ క్రమంలో తమిళనాడు అపధర్మ ముఖ్యమంత్రి తాజాగా ఓ లేఖను బయటపెట్టారు. పార్టీలో స్టానం కానీ, రాజకీయాలలోకి రావాలన్న అశ కానీ తనకు లేదని శశికళ.. జయలలితకు రాసిన లేఖ అది. కానీ ఇప్పుడు అటు ముఖ్యమంత్రి పీఠంతో పాటు ఇటు పార్టీ ప్రధాన కార్యదర్శి పదవితో పాటు పార్టీపై పట్టు బిగించారు. అసలు ఆ లేఖ రాయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో తెలుసా..? ఆ లేఖలో ఏముందో తెలుసా..?
2012లో శశికళను, ఆమె బంధువులను జయలలిత పోయెస్ గార్డెన్ నుంచి బయటకు గెంటివేశారు. ఆ సమయంలో తనను క్షమించాలంటూ శశికళ జయలలితకు లేఖ రాశారు. ఇప్పుడు ఆ లేఖను పన్నీర్ సెల్వం బయటపెట్టారు. ఆ లేఖలో ఏముందంటే.. ‘మా బంధువులు, మిత్రులు కొంతమంది నేను పోయ్సగార్డెనలో కలిసి ఉంటున్న సమయంలో నా పేరుని వాడుకుని అక్రమాలకు పాల్పడ్డారు. అన్నాడీఎంకేకు చెడ్డపేరు తీసుకొచ్చే విధంగా వ్యవహరించారు. అంతేకాకుండా మీకు వ్యతిరేకంగా కుట్రలు కూడా పన్నారు. ఇవన్నీ నాకు తెలియకుండానే జరిగాయి. కలలో కూడా నేను మీకు ద్రోహం తలపెట్టను. నా బంధువులు అక్రమాలకు పాల్పడ్డారు.
ఇది మన్నించరానిది. నేను మీతో ఉన్నంత మాత్రాన రాజకీయాల్లోకి రావాలనిగానీ, పార్టీ పదవులు కట్టబెట్టాలని ఏనాడూ కోరలేదు. అసలు ప్రజా జీవితంలో ప్రవేశించాలన్న ఆశ నాకెప్పటికీ రాలేదు. నా జీవితాన్ని మీ కోసమే అర్పించాను. నన్ను క్షమించి మళ్లీ దగ్గరకు తీసుకోండి’ అని ఆ లేఖలో శశికళ పేర్కొన్నారు. కాగా తనకు తెలిసిన విషయాల్లో 10 శాతమే బయటపెట్టానని, ఇంకా 90 శాతం తనలోనే ఉన్నాయని పన్నీర్ చెప్పడం మరింత ఉత్కంఠను రేకెత్తిస్తోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more