రైల్వే ట్రాకుపై నడవరాదని, అటు నుంచి ఇటు ఫ్లాట్ ఫాంలపైకి చేరాలన్నా తప్పక మెట్లదారిని వినియోగించాలని ప్రతీ రైల్వే స్టేషన్ లో అధికారులు బోర్డులను పెట్టి మరీ సూచిస్తుంటారు. అలా ట్రాకులపై నడవటం ప్రమాదకరమని, అంతేకాదు అది చట్టరిత్యా నేరమని కూడా బొర్డులు దర్శనమిస్తుంటాయి. కానీ ఆ బోర్డులపై రాసివున్నదేంటన్న విషయం మాత్రం కేవలం అక్షరాస్యులకు మాత్రమే తెలుసు. నిరక్షరాస్యులకు ఏం తెలుసు. పలు సందర్భాలలో అక్షరాస్యులు కూడా ఈ తప్పిదాలను చేస్తుంటారు. అయితే ఇలా ట్రాకులు దాటే వారిపై చట్టరిత్యా చర్యలు తీసుకున్న సందర్భాలు మాత్రం అరుదు.
అయితే చెత్త సేకరించే ఓ మహిళ చార్నీ రైల్వే స్టేషన్ వద్ద ట్రాకుపై పరద్యానంగా నడుస్తూ చర్చ్ గేట్ రైల్వే స్టేషన్ వైపు వెళ్తున్న ఓ పాస్ట్ ప్యాసెంజర్ రైలుకు ఎదురుగా వెళ్లింది. అమెను దూరం నుంచే గమనించిన రైలు డ్రైవర్ (లోకో పైలెట్) అదేపనిగా హరన్ ఇచ్చినా.. అమె అలానే నడిచింది. దీంతో అమెను రక్షించేందుకు గంటకు 70 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న రైలును డ్రైవర్ నిలిపేశాడు. కాగా వేగంతో వెళ్తున్న రైలు చివరాఖరున అమెకు కొన్ని ఇంచుల దూరంలోకి వెళ్లి అగింది.
వెంటనే తన క్యాబిన్ దిగిన రైలు డ్రైవర్ సంతోష్ కుమార్ గౌతమ్.. పక్కనున్న బోగిలోకి వెళ్లి రైలు ప్యాసెంజర్లకు విషయాన్ని తెలిపి.. అమెను పక్కను జరపాలని కోరాడు. రైలు సమీపించడంతో అమె ఫ్లాట్ ఫాం పైకి ఎక్కాలని ప్రయత్నించినా.. ఫ్లాట్ ఫామ్ చాలా ఎత్తుగా వుండటం వల్ల అమెకు అది సాధ్యపడలేదు. దీంతో అమె వద్దకు చేరకున్న ప్రయాణికులు అమెను ఫ్లాట్ ఫాం ఎక్కేందుకు సాయం చేశారు. కాగా ఓ ప్రాణాన్ని కాపాడిన గౌతమ్ ను పశ్చిమ డివిజన్ అధికారులు సన్మానించనున్నారు. కాగా పలువురు ప్రయాణికులు తమ సెల్ ఫోన్ లలో ఆ సన్నివేశాలను చిత్రీకరించి.. సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో ఆ వీడియో ఇప్పుడు హల్ చల్ చేస్తుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more