అటు సినీమాలలో హిట్ మీద హిట్ కోడుతూ తన వందవ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణితో శతచిత్రాలను పూర్తి చేసుకున్న నందమూరి బాలకృష్ణ.. ఇటు రాజకీయాలలో కూడా బిజీగా మారారు. అయితే తాను సినిమాలలో బిజీగా వున్న కారణంగా చేత ప్రతినిత్యం ప్రజలకు, టీడీపీ నేతలకు, కార్యకర్తలకు అందుబాటులో వుంటే అవకాశం లేనందున ప్రతీ రెండు, మూడు నెలలకు ఓసారి మాత్రం నియోజకవర్గంలో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు.
అయితే తాను నియోజకవర్గ ప్రజలకు నిత్యం అందుబాటులో లేనన్న బాధ, అసంతృప్తి పార్టీ శ్రేణులకు, నియోజకవర్గ ప్రజలకు లేకుండా చేయాలని భావించిన ఆయన ప్రజలకు నిత్యం అందుబాటులో వుండేలా ఒక వ్యక్తిగత సహాయకుడ్ని (పీఏ)ను నియమించుకున్నారు. అయితే తొలుత అంతా సవ్యంగానే సాగినా.. రానురాను పీఏ శేఖర్ మాత్రం బాలకృష్ణ తరువాత తానే ఎమ్మెల్యేను అన్న రీతిలో వ్యవహరించడం నియోజకవర్గ నాయకులకు రుచించడం లేదు.
బాలకృష్ణపై తమకు ఎలాంటి అసంతృప్తి లేదని నిర్మోహమాటంగా చెబుతున్న హిందూపురం టీడీపీ నేతలు.. శేఖర్ తలబిరుసు, అవినీతిపై మాత్రం సహించలేకపోతున్నామని స్పష్టం చేశారు. శేఖర్ ను పీఏగా తొలగించేంత వరకు తాము ఊరుకునేది లేదని తేల్చిచెబుతున్నారు. తమను కాదని, హిందూపుర్, లేపాక్షి, చిలమట్టూర్ పురపాలక సంఘాలలో తన ఇస్టానుసారం వ్యవహరిస్తున్నారని, పార్టీ శ్రేణులను కాదని ఎందుకిలాంటి చర్యలు చేపడుతున్నారో అర్థం కావడం లేదని నేతలు తీవ్రస్తాయిలో ఫైర్ అవుతున్నారు.
శేఖర్ ను తొలగించాలంటూ ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే సిసి. వెంకటరాయుడు అమరణ దీక్షకు పూనుకుంటున్నట్లు ప్రకటించారు. ముందుగా నియోజకవర్గంలోని పార్టీ నేతలు, కార్యకర్తలు అభిప్రాయాలను సేకరిస్తున్న ఆయన అందరి అభీష్టం మేరకు శేఖర్ ను తక్షణం పీఏ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే హిందూపూర్, లేఫాక్షి మండలాల్లో కార్యకర్తల అభిప్రాయాలను తీసుకున్న ఆయన ఈ నెల 5న చిలమట్టూర్ మండలంలోనూ అభిప్రాయ సేకరణ కోసం సమావేశాన్ని నిర్వహించనున్నారు.
తన వ్యక్తిగత సహాయకుడు శేఖర్ పార్టీ నేతలు, కార్యకర్తల మనోబిష్టానికి వ్యక్తిరేకంగా వ్యవహరిస్తున్నారని స్థానిక మీడియాతో పాటు ఇటు రాష్ట్రస్థాయిలో చర్చనీయాంశంగా మారుతున్నా.. బాలకృష్ణకు ఈ విషయం తెలియదా..? అన్న విమర్శలు కూడా తెరపైకి వస్తున్నాయి. బాలకృష్ణ డైరెక్షన్ లోనే శేఖర్ వ్యవహరిస్తున్నారా..? అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. సినీరంగంలో శతకర్ణి బాలయ్య.. తండ్రి వారసత్వాన్ని నిలబెట్టారు, కానీ రాజకీయాల్లో ముక్కుసూటి తత్వంతో వ్యవహరించిన స్వర్గీయ ఎన్టీరామారావు, అంధ్రుల అన్న.. వారసత్వాన్ని నిలబెట్టుకుంటారా.. లేదా..? అన్నది వేచిచూడాల్సిందే.
(And get your daily news straight to your inbox)
Apr 03 | ఉత్తరప్రదేశ్ లో జరగనున్న పంచాయతీ ఎన్నికలు ఈసారి గ్లామరెస్ గా మారనున్నాయి. తాను పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు ఫెమినా మిస్ ఇండియా -2015 రన్నరప్ దీక్షాసింగ్ ప్రకటించింది. జౌన్ పూర్ జిల్లా బక్షా... Read more
Apr 03 | ఎనబై ఏళ్లకు పైబడిన వయస్సులోనూ అమె తన జీవనం కోసం అలోచించకుండా పది మంది కడుపు నింపే పనికి పూనుకున్నారు. అందరూ తన బిడ్డల లాంటి వారేనని, అమె అందరికీ అందుబాటు ధరలోనే ఇడ్లీలు... Read more
Apr 03 | బెంగళూరు డ్రగ్స్ కేసు..శాండిల్ వుడ్ పరిశ్రమను షేక్ చేసి అక్కడి ప్రముఖులను ఊచలు లెక్కపెట్టించిన కేసుకు సంబంధించిన లింకులు తెలంగాణలోనూ బయటపడ్డాయి. ఆ మధ్య పలువురు నటుల చు్ట్టూ తిరిగిన ఈ కేసులో వారి... Read more
Apr 03 | అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్న అసోంలో బీజేపీకి దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. అసోం బీజేపి ప్రతినిధిగా ముఖ్యమంత్రి సోనూవాల్ ను అధిగమించి మరీ దూసుకుపోతున్న రాష్ట్ర మంత్రి హిమంత విశ్వశర్మపై చర్యలు తీసుకున్నఎన్నికల కమీషన్... Read more
Apr 03 | తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం అంకానికి మరికొన్ని గంటల వ్యవధిలో తెరపడుతుందన్న తరుణంలో రాజకీయ పార్టీల మధ్య విమర్శలు ప్రతివిమర్శలు, అరోపణలు ఊపందుకుంటున్నాయి. మరీముఖ్యంగా బీజేపిని టార్గెట్ చేస్తున్న ప్రతిపక్ష పార్టీ డీఎంకే అధినేత... Read more