మనీలాండరింగ్ కేసులో రెండు రోజుల క్రితం నిఘా సంస్థ సెంట్రల బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) విజయ్ మాల్యా కు చెందిన యూబీ గ్రూప్ సంస్థలపై దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. 900 కోట్ల లోను బకాయిలకు సంబంధించిన ఈ దాడుల్లో 9 మందిని అరెస్ట్ కూడా చేశారు. అయితే న్యాయస్థానం తనను దోషిగా తేల్చే వరకు తాను అమాయకుడినేనంటున్నాడు ఈ మాజీ లిక్కర్ కింగ్.
శుక్రవారం వరుసపెట్టి ట్వీట్లు చేసిన మాల్యా, మీడియానే తనను దోషిని చేసిందంటూ మండిపడ్డాడు. తన సారథ్యంలోని కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ బ్యాంకులకు బకాయి పడిన విషయంలో న్యాయపరంగా ఇప్పటి వరకు ఎటువంటి నిర్ణయం రాలేదని, అటువంటప్పుడు తనను దోషిగా ఎలా చిత్రీకరిస్తారని మీడియాపై మండిపడ్డాడు. వ్యక్తిగత హోదాలో ఎంత రుణపడి ఉన్నాననేది విచారణలో తెలుస్తుందని అన్నాడు.
సాధారణంగా మన దేశంలో దోషిగా తేలే వరకు అమాయకుడిగానే పరిగణిస్తారని, కానీ వివిధ రకాల ప్రభావాలకు లోనైన మీడియా తనను దోషిగా ప్రకటించేసిందని ట్వీట్లో ఆవేదన వ్యక్తం చేశా. బ్యాంకులకు బకాయి పడిన కారణంగానే విదేశాలకు పారిపోయానని అంటున్నారని, కానీ తను వ్యక్తిగతంగా ఏనాడూ రుణాలు తీసుకోలేదని మాల్యా పేర్కొన్నాడు.
"Loot"..."Gate" etc etc...such innovative headlines to describe me without Judicial determination ?? Fair and unbiased reporting ??
— Vijay Mallya (@TheVijayMallya) January 28, 2017
అయితే మాల్యాకు మరో దారిలేకనే ఇలా తీవ్ర విమర్శలకు దిగుతున్నాడంటూ ఓ సీనియర్ అధికారి వ్యాఖ్యానించాడు. అల్రెడీ అతనిపై రెడ్ కార్నర్ నోటీసు జారీ చేశారు. కేవలం తనపై సానుభూతి కలిగేందుకే మాల్యా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడంటూ ఆయన అన్నాడు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more