తమ సాంప్రదాయ క్రీడైన జల్లికట్టుకు శాశ్వత పరిష్కారం కావాలని, తాత్కాలికమైన ఆర్డనెన్సులు వద్దని తమిళనాడులో యువత అందోళలను చేపడుతున్న క్రమంలో దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రింకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి మార్కండేయ కట్జూ అసక్తికర వ్యాఖ్యలు చేశారు. జల్లికట్టుపై రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అర్డినెన్సు దేశ అత్యున్నత న్యాయస్థానం కొట్టివేస్తుందని అనుమానాల నేపథ్యంలో ఆయన కుండబద్దలు కొడుతూ వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన అర్డినెన్సు తాత్కాలికమైనదని అన్నారు.
అయితే ఈ అర్డినెన్సును తమిళనాడు ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టి అమెదించిన పక్షంలో అది చట్టంగా మారుతుందని కట్జూ అన్నారు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అమోదించిన బిల్లును కూడా దేశసర్వోన్నత న్యాయస్థానంలో సవాలు చేసే అవకాశం వున్నప్పటికీ రాజ్యంగంలోని అధికారణ 254(2) ప్రకారం జల్లికట్లు బిల్లుకు రక్షణ లభిస్తుందని అయన తేల్చిచెప్పారు. ఈ విషయంలో క్లారిటీ ఇచ్చిన ఆయన తమిళనాడు యువత ఈ విషయంలో అందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు.
అయితే జంతువుల పరిరక్షణ చట్టం కింద జల్లికట్టు వస్తున్నందున పార్లమెంటు చట్టం కన్నా తమిళనాడు సర్కారు చేసిన చట్టమే ఈ విషయంలో బలమైందని పేర్కోన్నారు. పశువులను పరిరక్షణ చట్టం ప్రకారం రాజ్యంగంలోని అధికారణ 254(2) మేరకు కేంద్ర ప్రభుత్వం కన్నా రాష్ట్ర ప్రభుత్వ చట్టానికే ప్రాధాన్యత అధికమని ఆయన చెప్పారు. ఇందుకు రెండు కారణాలున్నాయన్నారు. ఒకటి జంతు సంరక్షణ చట్టం ప్రకారం కేంద్రం తరువాత రాష్ట్ర ప్రభుత్వ చట్టం వస్తుందని, దీంతో పాటు రాష్ట్రపతి అసెంట్ కూడా లభించిందన్నారు. దీనిని ఏ న్యాయస్థానంలో సవాల్ చేసినా.. సక్సెస్ కాలేరని కట్జూ అభిప్రాయపడ్డారు.
ఇదిలావుండగా, జల్లికట్టును పునరుద్ధరిస్తూ తమిళనాడు ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయడాన్ని, ఆ వెంటనే అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదించి చట్టంగా రూపొందించచడాన్ని సవాలు చేస్తూ జంతు సంక్షమ బోర్డు (ఆనిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా- ఏడబ్ల్యూబీఐ), అంతర్జాతీయ జంతు కారుణ్య సంస్థ (పెటా) సహా ఇతర సంస్థలు దాఖలు చేసిన పిటిషన్లను విచారించేందుకు సర్వోన్నత న్యాయస్థానం అంగీకరిచింది. ‘జనవరి 30న జల్లికట్టుపై వేసిన అన్ని పిటిషన్లను ఒకేసారి విచారిస్తామని సుప్రీం ధర్మాసనం తెలిపింది.
జల్లికట్టు పేరుతో జంతువులను యధేచ్ఛగా హింసిస్తున్నారంటూ పెటా వ్యక్తం చేసిన వాదనను సమర్థించిన కోర్టు.. గత ఏడాది చివర్లో సంప్రదాయ క్రీడను నిషేధించిన సంగతి తెలిసిందే. అయితే జల్లికట్టు సంక్రాతి(పొంగల్) సందర్భంగా నిర్వహించే క్రీడ కావడంతో పండుగ వేళ తమిళనాడు వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అయ్యాయి. మెరీనా బీచ్ వేదికగా గతవారం భారీ నిరసనలు చోటుచేసుకున్నాయి. దీంతో తమిళనాడు ప్రభుత్వం హుటాహుటిన ఆర్డినెన్స్ జారీచేసింది. మరునాడే అసెంబ్లీలో జల్లికట్టుకు అనుకూలంగా తీర్మానం చేసింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more