గణతంత్ర్య దినోత్సవం రోజుల తమ హక్కుల సాధనకై తమిళ తంబీల తరహాలో వైజాగ్ ఆర్కే బీచ్ లో మౌన ప్రదర్శన నిర్వహించాలని యావత్ ఆంధ్రా నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. అయితే అందుకు అనుమతిచ్చే ప్రసక్తే లేదని చెబుతూ పోలీస్ బాస్ సాంబశివరావు నిన్న మీడియాలో క్లారిటీగా చెప్పిన విషయం కూడా చూశాం. సోషల్ మీడియా ద్వారా ఇచ్చే పిలుపులకి విలువ ఉండదన్న ఆయన, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు కూడా.
వైజాగ్ లోని ఆర్కే బీచ్ లో నిరసన జరుగుతుంది, రండి అని పిలుపునిస్తున్నారని ఆయన మండిపడ్డారు. అలా ఎవరు పడితే వాళ్లు పిలుపునిస్తే శాంతి భద్రతలు ఎవరు పరిరక్షిస్తారని ఆయన ప్రశ్నించారు. ఏదైనా జరిగితే ఎవరు బాధ్యులు?. చెన్నై అల్లర్లు కూడా ముందు శాంతియుతంగానే సాగింది. నిరసన కార్యక్రమానికి అనుమతి కావాలంటూ ఇంతవరకు తమను ఎవరూ సంప్రదించలేదని చెప్పారు. ఒకవేళ ఇప్పుడు అనుమతి అడిగినా బందోబస్తు ఏర్పాటు చేయడం కష్టమని చెప్పాడు. ఆర్కే బీచ్ లో నిరసనకు అనుమతి లేదని ఆయన తెలిపారు. రిపబ్లిక్ డే, పైగా శాంతి భద్రతల సమస్య ఎదురైతే చూస్తూ ఊరుకోమని ఆయన స్పష్టం చేశాడు.
ఇక విశాఖపట్టణంలోని ఆర్కే బీచ్ లో ఏపీకి ప్రత్యేక హోదా సాధన విషయమై ‘మౌన నిరసన’ కు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మద్ధతు ఇచ్చిన విషయంత తెలిసిందే. గత మూడు రోజులుగా ట్విట్టర్ వేదికగా పిలుపు ఇస్తున్న పవన్, దేశ్ బచావో పేరిట ఆల్బం ను విడుదల చేయటం, హక్కుల కాలరాయాలని చూస్తే మెడలు వంచుతాం అంటూ కేంద్రాన్ని హెచ్చరిస్తూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఏపీ డీజీపీ సాంబశివరావు చేసిన వ్యాఖ్యలపై మరోసారి స్పందించాడు.
నిరసన దీక్షకు అనుమతించకపోతే విద్యార్థుల్లో అశాంతి రగిలే అవకాశముందని, శాంతియుతంగా నిరసన తెలియజేయడం యువత హక్కు అని పవన్ పేర్కొన్నారు. విశాఖలో యువత నిరసన దీక్షకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని, ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు అందరికీ ఉందని, ఈ నిరసన దీక్ష రాజకీయాలకు అతీతమైందని, హామీల ఉల్లంఘన జరిగినప్పుడు నిరసన వ్యక్తం చేయడం దేశ పౌరులుగా వారి హక్కు అని పవన్ పేర్కొన్నాడు.
అంతేకాదు అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలపై కూడా స్పందించాడు. మోదీని వెళ్లి కలిసి మాట్లాడమంటున్నారు. ప్రచార సమయంలో వేదిక మీద ఆయనతోపాటు ఎంపీలంతా ఉన్నారు. ఇప్పుడు మీరంతా పార్లమెంట్ లో ఆయన పక్కనే కూర్చుంటున్నారు కదా. మీరేం చేస్తున్నారు. అంటూ మరో ట్వీట్ చేశాడు. అసలు ఇస్తారో, ఇవ్వరో చెప్పుకుండా ప్రజల అసంతృప్తిని తెలియజేయకుండా ఎందుకు మౌనంగా ఉంటున్నారు. మీరు ఏం చేయకండి. యువతను ఏం చేయనీయకండి. ఇక సమస్యకు పరిష్కారం ఎలా అంటూ మరో పోస్ట్ పెట్టాడు.
#APDemandsSpecialStatus If they don't allow it now; you are creating unrest in them. Peaceful protest is their right.
— Pawan Kalyan (@PawanKalyan) January 24, 2017
మొత్తానికి ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాలతోనే పోలీసులు ఈ ఆందోళనను అడ్డుకోవాలని చూస్తున్నట్లు క్లియర్ గా స్పష్టమౌతోంది. పరిణామాలను ప్రజలు, నేతలు నిశితంగా గమనిస్తున్నారు. మరి వైజాగ్ నిరసన విజయవంతంగా సాగుతుందా? లేక చెన్నై లా చిచ్చు రేగుతుందా? అలా జరగకూడదనే కోరుకుందాం.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more