భారత సరిహద్దులో కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతూ.. అక్రమ చోరబాట్లకు యత్నించే పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులపై పాకిస్థాన్ అక్రమిత కాశ్మీరులో భారత ఆర్మీ సర్జికల్ స్ట్రైక్స్ పాల్పడి.. ఉగ్రవాదుల ఫీచం అణిచివేయగా, అందుకు ప్రతికారంగా పాకిస్థాన్ ఉగ్రవాదులు ముగ్గురు కూలీలను చంపి పారిపోయారు. అయితే ముంబై దాడుల సూత్రధారి, జమాత్ ఉల్ దవా ఉగ్రవాద సంస్థ నాయకుడు, భారత మోస్టు వాంటెడ్ జాబితాలో వున్న హఫీజ్ సయీద్ మాత్రం 30 మంది భారత సైనికులను పాకిస్థాన్ ఉగ్రవాదులు హతమార్చారని చెప్పుకోవడం హేయకరం.
సరిహద్దులో శాంతి చేకూర్చాలన్న ఉద్దేశ్యంతో ఉగ్రవాద స్థావరాలపై భారత్ సైన్యం సర్జికల్ స్ట్రైక్స్ చేస్తే.. పాకిస్థాన్ మాత్రం తమ ఆర్మీని కాదని, ఉగ్రవాదులతో దేశం సరిహద్దులు దాటించి ముగ్గురు కూలీల ప్రాణాలను పోట్టనపెట్టుకుంది. ఇలా దేశ సరిహద్దు ప్రాంతం వరకు పాకిస్థాన్ కు చెందిన ఉగ్రవాదులు వచ్చి.. భారత భూభాగంలోకి చోచ్చుకోచ్చి కాల్పులు జరిపినా.. మరి పాకిస్థాన్ అర్మీ వారిని ఎలా రాణించిందన్న ప్రశ్న కూడా ఇక్కడ ఉత్పన్నమవుతున్నాయి. ఇంత జరుగుతున్న పాకిస్థాన్ అర్మీ గోళ్లు గిల్లుకుంటుందా..? అన్న ప్రశ్నలు కూడా ఉదయిస్తున్నాయి. కాగా 30 మంది భారత సైనికులను ఉగ్రవాదులు హతమార్చారన్న వార్తల్లో నిజం లేదని భారత ఆర్మీ అధికారులు స్పష్టం చేశారు.
హఫీజ్ వ్యాఖ్యలను ఖండించిన భారత సైన్యాధికారులు ఆ రోజు ఏం జరిగిందో మీడియాకు వివరించారు. ‘పాక్ సరిహద్దుకు 2 కిలోమీటర్ల దూరంలో జనరల్ రిజర్వ్ ఇంజనీర్ ఫోర్స్(డీఆర్ఈఎఫ్) క్యాంపుపై సోమవారం ఉగ్రవాదులు దాడిచేశారు. ఆ సమయంలో అక్కడ 10 మంది సిబ్బంది, మరో 10 మంది కూలీలు ఇంజనీరింగ్ పనులు చేస్తున్నారు. ఉగ్రవాదుల కాల్పుల్లో ముగ్గురు డీఆర్ఈఎఫ్ కూలీలు చనిపోగా, మిగిలినవారు సురక్షితంగా బయటపడ్డారు. హఫీజ్ చెప్పుకున్నట్లు 30 మంది చనిపోవడంగానీ, ఆర్మీ క్యాంపుపై దాడిగానీ జరగలేదు’ అని ఆర్మీ అధికారులు తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more