యూపీ రాజకీయాల్లో సైకిల్ సింబల్ పెట్టిన చిచ్చు మరో ములుపు తిరిగింది. విబేధాలు లేవంటూనే తండ్రి-కొడుకులు ఎన్నికల సంఘం అధికారిని కలవటం, సమాజ్ వాదీ గుర్తుపై సర్వహక్కులు మావేనంటూ మీడియా ముందు వాదులాడటం చూశాం. ఈ నేపథ్యంలో సైకిల్ ఎవరిది? అనే అంశాన్ని తేల్చడానికి తమకు నివేదిక సమర్పించాలంటూ ఈసీ ఇచ్చిన గడువు ఈ రోజుతో ముగిసింది.
ఇప్పటికే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ వర్గం ఈసీకి అఫిడవిట్ ఇచ్చి ఆ గుర్తు తమకే దక్కుతుందని ధీమా వ్యక్తం చేయగా, సోమవారం పార్టీ పెద్ద, నేతాజీ ములాయం సింగ్ యాదవ్ ఎన్నిలక కార్యాలయంకి వెళ్లారు. అక్కడ మీడియాతో మాట్లాడుతూ... తమ పార్టీలో జరుగుతున్న గొడవల వెనుక ఓ వ్యక్తి(రాంగోపాల్ యాదవ్ ను ఉద్దేశించి) ఉన్నాడని వ్యాఖ్యానించారు. అతని మూలంగానే తమ పార్టీలో ఓ సమస్య వచ్చిపడిందని చెప్పారు. తనకు, అఖిలేష్కు మధ్య ఎలాంటి వివాదాలు లేవని, తమ పార్టీలో నెలకొన్న సమస్యలు పరిష్కారమవుతాయని వ్యాఖ్యానించారు.
మరోవైపు ఈ విషయంలో అత్యధిక పార్టీ ప్రజా ప్రతినిధులు అఖిలేష్ వెంట ఉన్నారని పేర్కొన్న ఈసీ, ఎన్నికల గుర్తుపై మీరే తేల్చుకుని ఓ నిర్ణయానికి రావాలని స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. అందుకు నేటి సాయంత్రం వరకూ సమయమిస్తున్నామని, ఓ నిర్ణయానికి రాకుంటే, నిబంధనల ప్రకారం తాము వ్యవహరిస్తామని ఈసీ వెల్లడించినట్టు తెలుస్తోంది. కాగా, ములాయం తరువాత, అఖిలేష్ సాయంత్రం మరోసారి ఈసీ అధికారులను కలవనున్నట్టు తెలుస్తోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more