ఉత్తర్ ప్రదేశ్ లో అధికార సమాజ్ వాదీ పార్టీలో నెలకొన్న రాజకీయ సంక్షోభం ఎన్నికల షడ్యూలు విడుదల అయిన తరువాతైనా సద్దుమణుగుతుందని భావించినా.. రాను రాను మరింత జఠిలంగా మారుతుందా..? అన్నట్లుగా తయారైంది పరిస్థితి. పార్టీ పరిస్థితిపై మీడియా సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పిన పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్.. అంతలోనే మనస్సును మార్చుకున్నారు. తాను మీడియా సమావేశాన్ని రద్దు చేసుకున్నట్లు ప్రకటించారు. దీంతో అసలు పార్టీలో ఏం జరుగుతుందన్న ఉత్కంఠ కార్యకర్తలు, శ్రేణల్లో ఉత్కంఠ రేపుతుంది.
ఇదే సమయంలో పార్టీలో క్రియాశీలక నేత అమర్ సింగ్ తాజాగా ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ తనపై పెట్టిన నిబంధనలు విని ఒక్కసారిగా బావోద్వేగానికి గురయ్యారు. తాను నిక్కర్లు వేసుకున్న వయసు నుంచి తనకు తెలుసునని.. అతని చదువులు, ఎదుగుదల, వ్యక్తిగత జీవితం.. అన్నింటిలోనూ తోడ్పడ్డానని అన్నారు. కానీ ఇప్పుడు ‘నా’ అనుకున్నవాళ్లే మనల్ని ద్వేషిస్తే, మనల్ని వద్దనుకుంటే ఎంత బాధపడతామోకదా! ప్రస్తుతం నాదీ అలాంటి పరిస్థితే. అఖిలేశ్ నా గురించి మాట్లాడేవన్నీ వింటే నా గుండె బరువెక్కిపోతుంది..’ అంటూ భావోద్వేగానికి గురయ్యారు సమాజ్వాదీ పార్టీ ఎంపీ అమర్సింగ్.
పార్టీ సుప్రిమో ములాయం సింగ్ యాదవ్తో కలిసి ఢిల్లీ నుంచి లక్నో వచ్చిన అమర్సింగ్.. ఎయిర్పోర్టులో విలేకరులతో మాట్లాడారు. ‘మరో మాట లేకుండా నన్ను పార్టీ నుంచి గెంటేయాలని అఖిలేశ్ డిమాండ్ చేయడం బాధాకరం. సొంతవాళ్లే మనని ద్వేషిస్తూ ఆ బాధ వర్ణనాతీతం. నిజానికి నాకున్నవి రెండే రెండు కోరికలు. ఒకటి పార్టీలో పెద్దాయనే(ములాయమే) సుప్రీంగా ఉండాలి. రెండు, అఖిలేశ్ రాజకీయాల్లో ఇంకా ఉన్నతస్థానానికి ఎదగాలి. ఇంతకు మించి నాకేదీ అక్కర్లేదు’ అని అమర్సింగ్ అన్నారు.
ఇదిలాఉంటే, ఢిల్లీ నుంచి తిరిగివస్తోన్న తండ్రి(ములాయం)కి లక్నో ఎయిర్పోర్టులో స్వాగతం పలుకుదామనుకున్న సీఎం అఖిలేశ్.. చివరి నిమిషంలో మనసు మార్చుకున్నారు. ములాయం వెంట అమర్సింగ్ కూడా ఉండటమే అందుకు కారణమని, ‘శకుని మామ వెంటుంటే మనమెలా వెళతాం?’అని అఖిలేశ్ వ్యాఖ్యానించినట్లు ఆయన అనునాయులు పేర్కొన్నారు. తండ్రి ప్రాపకంతో తనకు వ్యతిరేకంగా ఎత్తులు వేస్తోన్న అమర్సింగ్ను అఖిలేశ్ ‘శకుని మామ’గా అభిర్ణించడం పార్టీలో అందరికీ తెలిసిందే అయినా.. పరిస్థితులు ఇలాగే కొనసాగితే పార్టీ చేజేతులా అధికారానికి దూరమవుతుందన్న వాదనలు కూడా తెరపైకి వస్తున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more