పెద్ద నోట్ల రద్దుతో ఇబ్బందులు భారత్ లోనే కాదు, ఇండియన్ కరెన్సీని నమ్ముకున్న పొరుగుదేశాల్లో కూడా నెలకొంది. ముఖ్యంగా భారత్ తో ఎక్కువ వాణిజ్య సంబంధాలు ఎక్కువగా ఉన్న నేపాల్ పై కొత్త కరెన్సీ కష్టాల ప్రభావం ఎక్కువగా పడింది. ఆ మధ్య సరైన సవరణ చట్టం తేకుండా తమ దేశంలో కొత్త నోట్లను అనుమతించబోమని నేపాల్ ప్రభుత్వం ఓ ప్రకటన కూడా చేసింది. దీంతో వెంటనే రంగంలోకి దిగిన ఆర్బీఐ అందుకు అవసరమైన రూల్ తోపాటు కొత్త నోట్లను నేపాల్ కు పంపేందుకు సిద్ధమైంది.
సుమారు వంద కోట్ల రూపాయల విలువైన రూ.100 నోట్లను పంపించేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంకు(ఆర్బీఐ) ముందుకొచ్చింది. ఇక్కడ భారత కరెన్సీ విరివిగా చలామణిలో ఉండడంతో నోట్ల రద్దు ప్రభావం వారిపైనా పడింది. ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లోని ప్రజలు డబ్బులు లేక అల్లాడిపోతున్నారు. వారి అవస్థలను దృష్టిలో పెట్టుకుని వారికి భారీ మొత్తంలో డబ్బులు పంపాలని ఆర్బీఐ నిర్ణయించింది.
భారత ప్రభుత్వం పెద్ద నోట్లు రద్దు చేసిన తర్వాత తమ దేశంలోని భారత కరెన్సీని చలామణి చేసుకునేందుకు అవకాశం కల్పించాలంటూ గత కొంతకాలంగా నేపాల్ రాష్ట్ర బ్యాంకు భారత్ను కోరుతోంది. దీంతో స్పందించిన ఆర్బీఐ తాజా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. జనవరి మాసాంతానికి రూ.100 కోట్ల విలువైన రూ.100 నోట్లను పంపించాలని నిర్ణయించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more