ఆర్థికంగా దేశాన్ని అల్లకల్లోలం చేసిన నిర్ణయంకు అర్థశతకం దాటిపోయింది. అంతేనా ప్రభుత్వం రద్దుచేసిన నోట్లను బ్యాంకుల్లో జమ చేసుకునేందుకు ప్రభుత్వం ఇచ్చిన గడువు డిసెంబర్ 30 నేటితో ముగియనుంది. మరోపక్క ఎల్లుండి నుంచి వీటిని పెద్ద మొత్తంలో కలిగి ఉంటే జైలు శిక్ష, జరిమానా అన్న ఊహాగానాల నేపథ్యంలో కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన ఆర్టినెన్స్ తో గురువారం సాయంత్రం ఓ స్పష్టమైన ప్రకటన చేసింది ఆర్బీఐ. రద్దయిన రూ.500, వెయ్యి నోట్లను పదికి మించి కలిగున్న వారికి రూ.10వేల వరకు జరిమానా విధించాలని కేంద్రం నిర్ణయించింది.
తొలుత ఆర్డినెన్సులో ఉన్నట్లుగా నాలుగేళ్ల కఠిన కారాగార శిక్ష విధించాలన్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంది. ‘ద స్పెసిఫైడ్ బ్యాంక్నోట్స్ సెస్సేషన్ ఆఫ్ లయబిలిటీస్ ఆర్డినెన్సు’ పేరిట దానిని రూపొందించింది. ఈ ఆర్డినెన్సు డిసెంబర్ 31 నుంచి అమల్లోకి రానుంది.
ఆర్డినెన్స్ లో ఏముంది?
డిసెంబర్ 30 వరకే నోట్ల డిపాజిట్ చేసుకోవాలి. రద్దయిన నోట్లు ఆపై ఆర్బీఐలోనే మార్చుకోవాలి. మార్చి 31 తర్వాత పాతనోట్లను కలిగున్నవారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవటంతోపాటు రూ.10వేల జరిమానా లేదా పట్టుకున్న ధనానికి ఐదురెట్ల జరిమానా విధించనున్నారు. జనవరి 1 నుంచి మార్చి 31 వరకు ప్రత్యేక కౌంటర్లలో పాతనోట్లను డిపాజిట్ చేస్తున్నప్పుడు డిక్లరేషన్ లో తప్పుడు సమాచారం ఇచ్చినట్లయితే.. రూ.5వేల జరిమానా లేదా డిపాజిట్ చేసిన మొత్తానికి ఐదురెట్లు (ఏది ఎక్కువైతే అది) వసూలు చేస్తారు.
అయితే రీసెర్చ్ స్కాలర్స్ 25 నోట్ల వరకు తమ దగ్గర పెట్టుకునేందుకు ఈ ఆర్డినెన్సు అనుమతిచ్చింది నేడు కూడా రద్దయిన నోట్లను బ్యాంకుల్లో జమచేసుకోలేకపోయిన వారు తగిన ఆధారాలు చూపించి రిజర్వు బ్యాంకులో వచ్చే ఏడాది మార్చి 31 వరకు మార్పిడి చేసుకోవచ్చు. విదేశాల్లో ఉన్నవారు, మిలటరీలో పనిచేసేవారు సరైన కారణాలను చూపిమాత్రమే ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.
కష్టాలు కొనసాగుతున్నాయా?
డిమాండ్ మేరకు కొత్త నోట్ల ముద్రణ లేకపోవడంతో మరో రెండు నెలలపాటు నోట్ల కష్టాలు కొనసాగవచ్చని ఆర్థిక రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు జైట్లీ ఈ యాభై రోజుల్లో వసూలైన పన్నుల రూపేణా పై సంతృప్తి వ్యక్తం చేశాడు. ఆర్థిక పరిస్థితి సజావుగానే ఉందని, అల్లర్లు ఎక్కడ జరగటం లేదని, ప్రజలు సమన్వయంతోనే ఉన్నారంటూ తెలిపాడు. మరోసారి సమీక్ష జరిపి అవసరం మేర 500 నోట్ల ముద్రణ జరిపి పంపిణీ చేయనున్నట్లు ప్రకటించాడు. ఇక నోట్ల రద్దు రోజు ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన ప్రధాని మరోసారి రేపు(డిసెంబర్ 31)న ప్రసగించనున్నాడన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more