ఒక రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రలు ఒక అంశంపై భిన్నంగా స్పందించారు. దేశం నుంచి అవినీతి, నల్లధనం, ఉగ్రవాద కార్యకలాపాలను అంతం చేసేందుకు తాము తీసుకున్న పెద్ద నోట్ల రద్దు చారిత్రక నిర్ణయమని కేంద్రం ప్రకటించి.. పదే పదే అదే ప్రకటనను చేయడంతో.. ఇది నిజమేనని దేశంలోని ప్రజలు భావిస్తున్న తరుణంలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ లు మాత్రం ఈ అంశంపై భిన్నంగా స్పందించి ప్రజలను అయోమయంలోకి నెట్టారు.
అదెలా అంటే పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయం చాలా బాగుందని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పలుమార్లు తన అభిప్రాయాన్ని బాహాటంగానే వ్యక్తపర్చారు. అయితే ఇదే క్రమంలో అయన బీజేపి నేతల భూముల కొనుగోళ్ల అంశం, బీజేపి నేతలు ఈ నిర్ణయానికి ముందు చేపట్టిన అర్థిక లావాదేవీల అంశంపై మాత్రం తప్పబట్టారు. వాటిని బీజేపి తప్పనిసరిగా బయటపెట్టాలని, వాటిపై వివరణ కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇదిలావుంటే, పెద్దనోట్ల రద్దు విషయంలో బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ మాత్రం పెదవి విరిచారు.
పెద్ద నోట్ల రద్దు ఎకానమీపై ఎమర్జెన్సీగా అభివర్ణించారు. పేద ప్రజల కొనుగోలు శక్తిపై కేంద్రం చేసిన సర్జికల్ స్ట్రైక్ గా అయన ఎద్దేవా చేశారు. దేశంలో సూపర్ ఎమర్జెన్సీ విధించినట్టుగా ఉందన్న బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతాబెనర్జీ వ్యాఖ్యలను బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ సమర్థించారు. నోట్ల రద్దు తరువాత దేశవ్యాప్తంగా సామాన్య ప్రజల అర్థిక స్థితిగతులు దారుణంగా మారిపోయాయన్నారు. ప్రజల కష్టాలు అంతకంతకూ పెరుగుతున్నాయని ఆయన అవేదన వ్యక్తం చేశారు.
దేశంలోని గ్రామీణ భారతంలో పరిస్థితులు మరీ దారుణంగా వున్నాయన్నారు. నోట్ల రద్దు నేపథ్యంలో ప్రజలను సంయమనం పాటించాలని చెబుతున్న ప్రధాని.. వారి కష్టాలపై మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడటం లేదని దుయ్యబట్టారు. ఏటీయం క్యూ లైన్లలో, బ్యాంకుల వద్ద క్యూలైన్లలో నిల్చుని ప్రాణాలు కోల్పోయిన వారి విషయంలో కనీసం సంతాపం వ్యక్తం చేసే సమయం కూడా ప్రధానికి లేకపోవడం ప్రభుత్వ అసమర్థతను తెలియజేస్తుందన్నారు. ఈ తరుణంలో మమత సూపర్ ఎమర్జెన్సీ వ్యాఖ్యలను తేజస్వి యాదవ్ సమర్థించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more