నగదుతో ముడిపడి వున్న దేశాన్ని నగదు రహిత లావాదేవీల వైపు పయనింపజేసేందుకు కేంద్రం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం సరైంది కాదని ప్రతిపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో.. కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం మరో ముందడుగు వేసేందుకు సిద్దం కానుంది. దీంతో ఇక డెబిట్, క్రెడిట్ కార్డుల అవసరం లేకుండా.. చెల్లింపులు చేసుకోవచ్చు. చేతిలో స్మార్ట్ ఫోన్ లేకపోయినా, స్మార్ట్ ఫోన్ యాప్ లేకపోయినా ఫర్వాలేదు. కేవలం ఆధార్ నెంబర్ తో అనుసంధానమైన బ్యాంకు అకౌంట్.. వుంటే చాలట.
ఈ సరికొత్త యాప్ ను కేంద్ర సర్కారు క్రిస్ మస్ రోజున విడుదల చేయనుంది. దుకాణదారులు ఆధార్ క్యాష్ లెస్ మర్చంట్ యాప్ ను తమ స్మార్ట్ ఫోన్లోకి డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే, రూ.2,000 ఖరీదు చేసే బయోమెట్రిక్ రీడర్ మెషిన్ ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇది వేలిముద్రలను గుర్తించే పరికరం అన్నమాట. ఈ మెషిన్ ను తన ఫోన్ కు అనుసంధానించుకోవాలి. ఏదైనా కొనుగోలు చేసిన తర్వాత దుకాణదారుడి వద్దనున్న ఆధార్ యాప్ లో కస్టమర్ తన ఆధార్ నంబర్ ను ఎంటర్ చేయాలి. బ్యాంకు పేరును సెలక్ట్ చేయాలి. ఆ తర్వాత బయోమెట్రిక్ రీడర్ పై వేలిని ఉంచితే చాలు లావాదేవీ పూర్తయినట్టే.
వేలిముద్రను స్కాన్ చేసిన తర్వాత అది ఆధార్ డేటాతో పోల్చుకుంటుంది. సరిగ్గానే ఉన్నట్టయితే బ్యాంకు ఖాతా నుంచి లావాదేవీకి సరిపడా నగదు దుకాణదారుడి ఖాతాలోకి వెళ్లిపోతుంది. ఎలాంటి పాస్ వర్డ్ లు, పిన్ నంబర్లు గుర్తుంచుకోవాల్సిన ఇబ్బంది కూడా లేదని యూఐడీఏఐ సీఈవో అజయ్ భూషణ్ ఓ మీడియా సంస్థకు తెలిపారు. సుమారు 40 కోట్ల ఆధార్ నంబర్లు బ్యాంకు ఖాతాలకు అనుసంధానమై ఉన్నాయని ఆయన చెప్పారు. మొత్తం వయోజనుల్లో సగం సంఖ్యకు ఇది సమానమని, మొత్తం అన్ని ఖాతాలను ఆధార్ నంబర్ తో మార్చి నాటికి అనుసంధానించాలని అనుకుంటున్నామని అజయ్ భూషణ్ తెలిపారు. ఐడీఎఫ్ సీ బ్యాంకు, యూఐడీఏఐ, ఎన్ పీఐ ఈ ఆధార్ యాప్ ను రూపొందించాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more