గత నెల 8న పెద్ద నోట్ల రద్దు చేసిన తరువాత ఇంకా దేశంలో అనేక మంది నల్లకుభేరులు తమ వద్దనున్న నల్లధనాన్ని కొత్త నోట్లతో భద్రపర్చకున్నారని.. అనడానికి దేశంలో పోలీసులు, అదాయ పన్నుశాఖ అధికారులు దేశవ్యాప్తంగా జరుపుతున్న దాడుల్లో పట్టుబడుతున్న నల్లధనమే రుజువు చేస్తుంది. ఈ నేపథ్యంలో కొత్తగా ప్రభుత్వం తీసుకువచ్చిన రెండు వేల రూపాయల నోటలో ఎదో వుందని, అందుకనే అధికారులు సరిగ్గా నల్లధనం వున్న చోటే దాడులకు పాల్పడుతున్నారన్న వార్తలు కూడా తెరపైకి వచ్చాయి.
అయితే దీనిపై ఆర్బీఐ, సహా కేంద్ర ఆర్థక మంత్రిత్వ శాఖ అధికారులు కూడా స్పందించారు. కొత్త రెండు వేల నోటులో చిప్ కానీ, లేదా శాటిలైట్ గుర్తించే రేడియోధార్మిక ఇంక్ కూడా లేదని స్పష్టం చేశారు. తమకు వేగుల ద్వారా అందిన పక్కా సమాచారంతోనే ఈ దాడులకు పాల్పడుతున్నామని చెప్పారు. ఈ నేపథ్యంలో దేశంలో డబ్బును భద్రపర్చుకున్న నల్లధన కుబేరులు ఇంకా పెద్ద సంఖ్యలో వున్నారని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. అందుకు ప్రజల సహాకారం తీసుకోవాలని కూడా యోచించి నల్లధన కుబేరుల వివరాలు తెలిస్తే తమ ఈ మెయిల్ కు పంపాలని కోరింది.
ఇలా కోరికోరగానే భారత ఆదాయపు పన్ను శాఖకు ఈ-మెయిల్స్ వెల్లువెత్తాయి. 'blackmoneyinfo@incometax. gov.in' మెయిల్ కు నల్లధనాన్ని దాచుకున్న వారి వివరాలు కుప్పలు తెప్పలుగా వచ్చిపడ్డాయి. కేవలం 72 గంటల వ్యవధిలో 4 వేలకు పైగా మెయిల్స్ వచ్చాయి. తమ విన్నపానికి ప్రజల నుంచి అద్భుత స్పందన వచ్చిందని, ఆర్థిక శాఖ ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఈ మెయిల్స్ అన్నీ పరిశీలిస్తున్నామని చెప్పారు.
అనుమానం వచ్చిన ఈ మెయిల్స్ ను ముందు వరుసలో పెట్టి వాటిని పరిశీలిస్తున్నామని, వివరాలన్నీ సేకరించిన తరువాత వీరిపై దాడులు జరిపేందుకూ సిద్ధంగా ఉన్నామని సదరు అధికారి తెలిపారు. ఈ మేరకు ఎఫ్ఐయూ (ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్) చర్యలు తీసుకోనుందని వెల్లడించారు. జన్ ధన్ ఖాతాల్లో చేరిన భారీ మొత్తంలో డబ్బుతో పాటు, ప్రైవేటు బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన డబ్బు, బ్యాంకు అధికారుల ప్రమేయం తదితరాంశాలపై ఫిర్యాదులు ఎక్కువగా వచ్చాయని, బంగారం, లగ్జరీ వస్తువుల కొనుగోళ్లు తదితరాలపైనా మెయిల్స్ అందుకున్నామని ఆర్థిక శాఖ అధికారి స్పష్టం చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more