బ్యాంకు క్యూ లైన్లో ‘‘ఆ నలుగురు’’.. ఫోటోలో వైరల్ Twitterati go berserk captioning this picture of PM, Manmohan Singh and LK Advani

Twitterati go berserk captioning this picture of pm narendra modi manmohan singh and lk advani

narendra modi, manmohan singh, lk advani, pm modi, viral photo, parliament attack, pm tribute to parliamnet attack, viral photo, cash seizure, Cash ban, currency ban, Income Tax department, demonetisation

PM Modi looking sternly at the camera, with former PM Manmohan Singh behind him, then senior BJP member and MP LK Advani and lastly Union finance minister Arun Jaitley standing in a bank queue.

బ్యాంకు క్యూ లైన్లో ‘‘ఆ నలుగురు’’.. ఫోటో వైరల్

Posted: 12/15/2016 10:54 AM IST
Twitterati go berserk captioning this picture of pm narendra modi manmohan singh and lk advani

ఒక ఊహాజనిత చిత్రం.. బహుశా మన దేశంలో మాత్రం ఇలాంటి అరుదైన ఘటనలు ఎప్పుడు చోటుచేసుకోకపోవచ్చు. కానీ అలాంటిదే జరిగితే.. ఎలా వుంటుందన్న ఉద్దేశ్యంతోనో.. లేక తాంబూలాలిచ్చాం.. తన్నుకు చావండీ అంటూ మా నిర్ణయం మేము తీసుకున్నాం.. ఇక కష్టాలు పడండీ అంటూ కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగానో మొత్తానికి ఒక ఫోటో మాత్రం సంచలనంగా మారుతుంది. ఈ ఫోటోకు క్యాషన్లు పెట్టడంలో ఇప్పుడు నెట్ జనులు ఫుల్ జబిజీగా వున్నారు. చేతిలో చిల్లిగవ్వ లేక డబ్బు కోసం ఎంతలా ప్రజలు బాధపడుతున్నారో ఈ ఫోటోతో అర్థం అవుతుంది. ఇంతకీ ఆ ఫోటో ఏంటీ అంటారా..?

పెద్దనోట్ల ర‌ద్దు నేప‌థ్యంలో దేశంలోని సామాన్యులు ఎదుర్కోంటున్న పరిస్థితులు దేశంలోని బడా రాజకీయ వేత్తలకు ఎదురైతే.. ఎలా వుంటుంది. డబ్బులు డ్రా చేసుకోడానికి వారు గంటల తరబడి బ్యాంకుల ముందు క్యూ క‌డుతూ క‌నిపిస్తే.. ఎలా వుంటుంది..? వారికి ప్రజల అవస్థలు అర్థమైతే బాగుండు అనుకున్నవారెవరో ఈ ఆలోచ‌నే చేశారు. దానిని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. అంతే అది కాస్తా వైరల్ గా మారింది. ఎందుకలా అంటే.. దానికి కారణం లేకపోలేదు. తమ మదిలో వున్న అభిప్రాయాలను ఆ ఫోటోలపై పెట్టి మరీ నెట్ జనులు మళ్లీ మళ్లీ పోస్ట్ చేస్తున్నారట. దీంతో ఆ నలుగురు ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెడింగ్ అవుతుంది.

ఇంతకీ ‘‘ఆ నలుగురు’’ ఎవరు..? ఏమా కథ అంటారా..? నెటిజన్లు. సృష్టించిన ఫోటోలో మొదట ప్రధానమంత్రి నరేంద్రమోడీ బ్యాంకు ఎదుట క్యూ లైన్లో నిలబడి వున్నారు. ఆయ‌న వెనుకే మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌, ఆ త‌రువాత బీజేపీ సీనియ‌ర్ నేత‌ ఎల్‌కే అద్వానీ, అ తరువాత కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి అరుణ్ జైట్లీ ఉన్నారు. అయితే ప్రధానితో పాటు మన్మోహన్ సింగ్, అద్వానీ కూడా క‌ళ్లజోడు పెట్టుకొని తాము సాధార‌ణంగా ప్రజ‌ల‌కు కనిపించే గెట‌ప్‌లోనే బ్యాంకు క్యూ ముందు నిల‌బ‌డ్డారు. మోదీ ఈ క‌ల్పిత ఫొటోలో సీరియ‌స్‌గా క‌నిపిస్తుండ‌గా, మిగ‌తా వారు డ‌బ్బుల కోసం క్యూ క‌ట్టి క‌ష్ట‌పడిపోయిన‌ట్లు క‌నిపిస్తున్నారు.

దీంతో ప్రధాని ముందు నిల్చున్న వ్యక్తి ఏటీయం కేంద్రంలోకి వెళ్లి వెళ్లగానే తన జేడులో వున్న బ్యాంకు డెబిట్ కార్డులు వరుస క్రమంలో తీసి.. ఒక్కో దాని నుంచి డబ్బులు డ్రా చేస్తున్నారని, దీంతో తమ వరకు డబ్బులు వుంటాయా..? లేక మొత్తం అతనితోనే అయిపోతాయా..? అన్నది అర్థంకాక ప్రధాని నరేంద్రమోడీ తన ముఖాన్ని సిరియస్ గా పెట్టారంటూ.. నెట్ జనులు ఎవరికి తోచిన విధంగా వారు జోకులు వేసుకుని మరీ ఆ ఫోటోలను అప్ లోడ్ చేస్తున్నారు. దీంతో ఈ ఫోటో కాస్తా హ్యూమరస్ గా మారి నెట్ లో చక్కర్లు కొడుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : narendra modi  manmohan singh  lk advani  pm modi  viral photo  Netzens  

Other Articles