పెద్దనోట్ల రద్దు తరువాత అక్రమార్కుల గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. అదాయపన్ను శాఖ అధికారులు దేశవ్యాప్తంగా దాడులు నిర్వహించి అక్రమంగా నిల్వచేసుకుని(అందులోనూ ప్రభుత్వం ముద్రించిన కొత్త రెండు వేల రూపాయల నోట్ల రూపంలో దాచుకున్న) ధనాన్ని స్వాధీనం చేసుకుంటున్న తరుణంలో.. అక్రమార్కులు గజగజ వణుకుతున్న మాట వాస్తవం. మునుప్పెన్నడూ లేని విధంగా అక్రమార్కుల ఆటలను ఐటీ అధికారులు కట్టడి చేస్తున్నారు. ఈ తరుణంలో అక్కడ భారీగా నల్లడబ్బు వుందని తమకు అందిన సమాచారంతో ఓ అపార్టుమెంటులోకి వెళ్లిన అధికారులకు చుక్కలు చూపించింది ఓ వృద్దురాలు. దీంతో చేసేది లేక తమ కాళ్లకు బుద్ది చెప్పుకున్నారు అదాయశాఖ అధికారులు. అదెట్టా..? అంటారా..
ఉత్తర బెంగళూరు ప్రాంతంలోని యశ్వంత్ పూర్ ఏరియాలో గల ఓ అపార్టుమెంట్ లో పెద్ద మొత్తంలో డబ్బు ఉందని ఆదాయం పన్ను (ఐటి) అధికారులకు సమాచారం అందింది. ఐటీ అధికారుల బృందం అపార్టుమెంట్ కు చేరుకుని తనిఖీలు చేపట్టేందుకు వెళ్లగా ఓ వృద్దురాలు వారిని నిలువరించింది. తమ ఇంట్లోకి రావటానికి మీకేం పని మా ఇంట్లో అంటూ అధికారులపైకి ఇంటి యజమాని ఇంట్లో పెంచుకుంటున్న రెండు కుక్కలను వదిలింది. దీంతో షాక్ కు గురైన అధికారులు పరుగులు తీశారు.
దీంతో కంగారుపడిన అధికారులు చేసేది లేక వెనుదిరిగి స్థానిక పోలీసుల సాయం తీసుకుని ఎట్టకేలకు లోపలకు ప్రవేశించి తనిఖీలే చేపట్టగా వారు మళ్లీ షాక్ కు గురయ్యారు. తమకు వచ్చిన సమాచారం కరెక్టేనని భావించారు. ఇంటి మొత్తం ఎక్కడా డబ్బులు లేకపోవడంతో వెనుదిరుగుతున్న అధికారులకు తాళం వేసి ఉన్న గది కనిపించింది. దాంతో తాళం పగులగొట్టి తనిఖీలు చేసిన అధికారులు అందులో 2కోట్ల 89 లక్షల నగదు దాచి వుంచడాన్ని కనిపెట్టారు. మొత్తం డబ్బును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వారికి వచ్చిన లెక్కల్లో చూపని రూ.2.89 కోట్ల నగదును పట్టుకున్నారు. వీటిలో 2.25 కోట్ల రూపాయలు విలువచేసే కొత్త 2 వేల నోట్లు కూడా ఉన్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more