అమ్మ, తమిళుల పాలిట పురచ్చి తలైవి, తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అనంత వాయువులలో ఐక్యం కాగానే పార్టీని నడిపేదెవరూ అన్న ప్రశ్నలతో సతమతం అవుతున్న తమిళులకు చిన్నమ్మ కనపించారు. జయలలిత నిచ్చెలిగా అమె తరువాత అంతా ఈమె అన్నట్లుగా పార్టీలో నెంబర్ టు స్థానాన్ని అధిరోహించిన వ్యక్తి అమె. అయితే గత కొన్నాళ్ల క్రితం అమెను జయలలిత మొత్తానికి దూరం పెట్టారు. ఆ తరువాత పార్టీ వ్యవహరాల నుంచి అమె భర్తను దూరం చేశారు. అయితే అమ్మతో చనిపోయినప్పుడు మాత్రం శశికళ అమె పక్కనే వున్నారు. అంత్యక్రియలు కూడా అమె నిర్వహించారు.
అమ్మ కాలగమనంలో కలసిపోయిన తరువాత అర్థరాత్రి పన్నీరు సెల్వం ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన పాలనాపగ్గాలను అందుకున్నారు. కాగా ఇక పార్టీని నడిపేదెవరని ప్రశ్న ఉత్పన్నం కాగానే క్రితం రోజు రాత్రి పలువురు ఎమ్మెల్యేలు చిన్నమ్మ శశికళ వైపు అకర్షితులయ్యారు. అమెను పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని అందుకొమ్మని వేడుకున్నారు. దీంతో పార్టీలో చిన్నమ్మ భజన వేగంగా తెరమీదకు వచ్చింది. ఈ క్రమంలో జయ టీవీ ప్రసారం చేసిన మరో వార్త కూడా సంచలనంగా మారింది.
ముఖ్యమంత్రి పీఠంపై కన్నేసిన శశికళ, జయలలిత మరణించగానే తన వర్గం వారితో రాజకీయ నాటకాలకు తెరలేపిందన్న వార్తల నేపథ్యంలో ఇక సీఎం సెల్వంకు, శశికళకు మధ్య భగ్గుమంటుందని వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో.. చిన్నమ్మ శశికళే పార్టీ ప్రధానకార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించి అన్నాడీఎంకేను ముందుకు నడిపించాలని సీఎం పన్నీరు సెల్వం స్వయంగా కోరినట్లు వార్తలు ప్రసారం కావడం పార్టీ వర్గాలను షాక్ కు గురిచేశాయి.
ఈ విషయంలో మరో ఆలోచన లేదని, అలాంటిది ఏదైనా ఉంటే వారు నిజమైన అన్నాడీఎంకే కార్యకర్తలు కారని సెల్వం అన్నట్లు జయ ప్లస్ టీవీ పేర్కొంది. జయలలిత బాధల్లో శశికళ అండగా నిలబడ్డారని సెల్వం అన్నట్లు చెప్పింది. 30 ఏళ్లకు పైగా అమ్మతో కలిసి పనిచేసిన శశికళకు పార్టీని ఎలా నడపాలో తెలుసునని సెల్వం అన్నారు. అంతేకాకుండా అమ్మ లాగే శశికళ పార్టీలోని ప్రతి కార్యకర్తకు తెలుసని చెప్పారు. పార్టీలో పరిపాలన సజావుగా సాగాలంటే కచ్చితంగా చిన్నమ్మే పగ్గాలు అందుకోవాలని పేర్కొన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more