పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో నగదు చెల్లింపులపై అన్ని ప్రభుత్వ శాఖలకు కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై ఐదు వేల దాటి నగదు చెల్లింపులు చేయాలంటే ఈ-పేమెంట్ సౌకర్యం వాడుకోవాలంటూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ చెల్లింపులన్నీ డిజిటలైజ్ చేసి, ఈ-పేమెంట్స్ ను ప్రోత్సహించాలన్న సంకల్పంతో అన్ని మంత్రిత్వశాఖలకు ఈ ఉత్తర్వులను జారీ చేస్తున్నట్లు తెలిపింది.
కాగా, గత ఆగస్టులో నగదు చెల్లింపులపై రూ.10 వేల వరకు పరిమితి విధించగా, ఇప్పుడు దానిని కేంద్రం రూ.5 వేలకు కుదించడం గమనార్హం. ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఈ-పేమెంట్స్ను మరింతగా ప్రోత్సహించాలని, దేశమంతటా నగదు రహిత చెల్లింపుల విధానం తీసుకురావాలని కేంద్రం సంకల్పించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జైట్లీ ఆమోదంతో తాజా ఉత్తర్వులు జారీఅయ్యాయి.ఈ విధానం తక్షణం అమల్లోకి వస్తుందని పేర్కొంది. ఈ మేరకు అన్ని ప్రభుత్వ విభాగాలకు, మంత్రిత్వశాఖలకు ఆదేశాలు జారీ చేసింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more