అమ్మ బతికే అవకాశాలు ఫిఫ్టీ-ఫిఫ్టీ అని తేల్చేయటంతో ఇక ఇప్పుడు రాజకీయ వారసుడి ఎంపిక వైపు దృష్టి సారించారు. అన్నాడీఎంకే ఎంపీలు, ఎమ్మెల్యేలను అపోలో ఆస్పత్రికి రావాల్సిందిగా పార్టీ అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. సాయంత్రం 7 గంటలకు వీరందరూ భేటీ కానున్నారు.
జయలలిత వారసుడిని ఎంపిక చేయడం ద్వారా పార్టీలో ఎలాంటి అనిశ్చితి తలెత్తకుండా ఉండేందుకు కసరత్తు జరుగుతోంది. ఎమ్మెల్యేల నుంచి డిక్లరేషన్ ఇవ్వాల్సిందిగా పార్టీ కోరిందని, జయ విధేయుడు, అన్నాడీఎంకే సీనియర్ నేతల్లో ఒకరైన పన్నీరు సెల్వంకే పార్టీ పగ్గాలు అప్పగించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆయన పేరును ఖరారు చేశారు. 135 ఎమ్మెల్యేల మద్ధతు ఆయనకు ఉన్నట్లు తెలుస్తోంది. చర్చల్లోనే మద్ధతుగా సంతకాల సేకరణ కూడా జరిగే అవకాశం ఉంది.
ఈమేరకు సాయంత్రంలోగా అధికారికంగా ఒక ప్రకటన వెలువడే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. కాగా, తమిళనాడులో కీలక మంత్రిత్వ శాఖలన్నింటినీ పన్నీర్ సెల్వంకు ఇటీవలే అప్పగించారు. గతంలో రెండుసార్లు తాత్కాలిక సీఎంగా పన్నీరు సెల్వం వ్యవహరించారు. తమిళనాడు రాజకీయాల్లో చిరకాల ప్రత్యర్థిగా ఉన్న కరుణానిధి, ప్రతిపక్ష నేత స్టాలిన్లు కూడా జయ పూర్తిగా కోలుకోవాలని కోరుతున్నట్టు ఉదయం ట్వీట్లు చేశారు. మరోవైపు ఆమె కోలుకోవాలని తమిళనాడు వ్యాప్తంగా ఉన్న ఆలయాల్లో ప్రజలు పూజలు నిర్వహిస్తున్నారు.
అదనపు బలగాల కోసం...
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యపరిస్థితి అత్యంత విషమంగా ఉందని అపోలో వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేసిన వెంటనే తమరాష్ట్రానికి అదనపు పారామిలటరీ బలగాలను పంపాలని కేంద్రాన్ని తమిళనాడు ప్రభుత్వం కోరింది. దీంతో తమిళనాడు పంపేందుకు కేంద్రం 9 కంపెనీల పారామిలటరీ బలగాలను సిద్ధం చేసింది. వీటికి తోడు తమిళనాట లీవులో ఉన్న పోలీసుల సెలవులు రద్దు చేసి విధుల్లో చేరాలని ఆదేశించింది. దీనికి తోడు స్కూళ్లకు సెలవులు ప్రకటించింది. ఎప్పుడు తెరిచేది ప్రకటిస్తామని తెలిపింది. దీనికితోడు అపోలో ఆసుపత్రి నుంచి పోయెస్ గార్డెన్ వరకు రోడ్డును బ్లాక్ చేసింది. సాయంత్రం 6 గంటలకు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలంతా సమావేశం కానున్నారు. దీంతో తమిళుల్లో ఆందోళన పెరిగిపోతోంది.
వైద్య నిపుణుడు రిచర్డ్ బేలె జయలలిత ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి ఓ ప్రకటన చేశారు. జయలలిత ఆరోగ్యం చాలా విషమంగా ఉందని ఆయన చెప్పారు. జయలలిత ఆరోగ్య పరిస్థితిని ప్రస్తుతం మిగతా వైద్యులతో కలిసి తాను కూడా సమీక్షిస్తున్నట్లు చెప్పారు. అధునాతన వైద్య పరికరాల సాయంతో ఆమెకు చికిత్స అందుతోందని చెప్పారు.
గుండె పోటుతో ఒకరి మృతి...
చెన్నయ్లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వచ్చిన వార్తలను చూసిన ఆమె అభిమాని, అన్నాడీఎంకే కార్యకర్త నెలగందన్కు గుండెపోటు వచ్చింది. టీవీల్లో న్యూస్ చూస్తూ గుండెపోటుకు గురై తీవ్ర నొప్పితో బాధపడుతున్న ఆయనను గమనించిన కుటుంబసభ్యులు ఆయనను ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే మరణించాడు. నెలగందన్ కడలూరు జిల్లా గాంధీ నగర్కు చెందిన వ్యక్తి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more