కేరళలో మధ్యం కొనాలంటే తప్పని సరిగా మందుబాబులు దుకాణాల ముందు క్యూ కట్టాల్సిందే. అయితే ఆ క్యూలను పెద్దనోట్ల రద్దు తరువాత ఏటీయం, బ్యాంకుల వద్ద క్యూలతో పోల్చిన మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోంటున్న విషయం తెలిసిందే. మద్యం దుకాణాల మందు వేచివున్న వారు ఏటీయంలలో నిల్చోడానికి ఎమిటీ ఇబ్బంది అని మరీ అయన కోట్ చేయడం ఆయన అభిమానులతో పాటు అన్ని వర్గాల ప్రజలు అసహనం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆయనపై రకరకాల విమర్శలు, అరోపణలు కూడా సోషల్ మీడియాలో వెల్లువెత్తాయి.
పెద్దనోట్లను రద్దు చేస్తూ ప్రధాని నరేంద్రమోడీ తీసుకున్న నిర్ణయం చాలా గొప్పదని, దీనిని అందరూ స్వాగతించాల్సిందేనని, తాను ఈ నిర్ణయానికి పెద్ద సెల్యూట్ చేస్తున్నానని, ఈ నిర్ణయంతో తాను కూడా కొంత ఇబ్బంది పడ్డానని, క్యూ లైన్లలో నిల్చుని తాను డబ్బు పోందానని అయన పేర్కోన్నారు, ఈ వ్యాఖ్యలు చేయడంతో ఆయన ఒక్కసారిగా విమర్శలపాలయ్యారు, అంతేకాదు తాజాగా ఆయన గురించి బయటకు వచ్చిన ఓ వార్త అయనను పెద్ద వివాదంలోనూ ఇరికించింది.
పెద్ద నోట్ల రద్దు విషయం ఈ హీరోకు ముందే తెలుసని, దాంతో తన దగ్గరున్న రూ. 3,300కోట్ల బ్లాక్ మనీతో కువైట్లో ఒక డ్రిల్లింగ్ కంపెనీ ప్రారంభించాడని సోషల్ మీడియాలో రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. దీనికి సంబంధించిన వీడియో సైతం మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇది నిజమేనంటూ కువైట్లోని న్యూస్ ఏజెన్సీలు సైతం ఇండియాకు చెందిన స్టార్ నటుడు తమ దేశంలో రూ. 3,300కోట్లతో పెట్టుబడి పెట్టారంటా వార్తలు ప్రచురించాయి.
నల్ల ధనం మొత్తాన్ని ముందుగానే తరలించి ఇప్పుడు ఇలాంటి మాటలు చెప్తారా అంటూ ఈ హీరోపై మండి పడుతున్నారు. నల్లధన కుబేరులు తమ డబ్బును ముందుగా విదేశాలకు తరలించి.. ఇప్పడు మొసలికన్నీరు కారుస్తున్నారంటూ నెట్ జనులు ఘాటు కామెంట్లను పోస్ట్ చేస్తున్నారు. దాచేది నల్లడబ్బు చెప్పిది మాత్రం సూక్తులా అంటూ పైగా ప్రధాని నిర్ణయం పట్ల కితాబులు వెలిబుచ్చడంపై ఆయన విమర్శలపాలవుతున్నారు.
ఇక కొత్తగా రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్న ఎంఎం మణి అనే సీనియర్ కమ్యూనిస్టు నేత కూడా మోహల్ లాల్ పై తీవ్ర అరోపణలు చేశారు. ఆయన వద్ద కట్టల కోద్ది నల్లధనం వుందని, సరిగ్గా పన్ను చెల్లించలేని నాయకులు సగటు భారతీయుడికి సూక్తులు ఎలా చెబుతారంటూ మండిపడుతున్నారు. ఇక మరికోందరు నెట్ జనులు ఆయన గత విషయాలను కూడా తొవ్వుతున్నారు, 2011లో ఆయన ఇంటిపై దాడి చేసిన అదాయపన్ను శాఖ అధికారులకు ఏనుగు దంతాలు కూడా లభించాయని గుర్తు చేశారు.
ఇక మరికొందరు మోహన్ లాల్ ను ఆయన బినామీ ఏవరో కూడా బయటపెట్టాలని అని డిమాండ్ చేశారు. దాడి చేసిన ఆదాయ పన్ను అధికారులు నోట్ల మార్పిడికి జనం క్యూలో నిల్చోడంలో కష్టమేమీ లేదని, మంచి పని కోసం ఆ మాత్రం చేయాలన్న మోహన్లాల్ అభిప్రాయం ఈ మంటకు మరింత ఆజ్యం పోస్తోంది. చూద్దాం మరి ఈ వివాదం నుంచి ఈ స్టార్ హీరో ఎలా గట్టెక్కుతాడో వేచి చూడాలి మరి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more