విశాఖపట్టణంలోని ఏసీఏ-వీడీసీఏ రాజశేఖరరెడ్డి స్టేడియం వేదికగా జరుగుతున్న రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో తొలి రోజు టీమిండియా సత్తాచాటింది. తొలి రోజు ఆటలో బ్యాటింగ్ పిచ్ అయిన విశాఖలో టీమిండియా టాప్ ఆటగాళ్లు ఛటేశ్వర్ పుజారా (119), విరాట్ కోహ్లీ సెంచరీలతో సత్తా చాటారు. వీరిద్దరి అద్భుతమైన భాగస్వామ్యంతో టీమిండియా తొలిరోజు పటిష్ఠ స్థితిలో నిలిచింది.
కాగా, టాస్ గెలిచిన కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో ఓపెనర్ కేఎల్ రాహుల్ (0) ఆదిలోనే అవుటై అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాడు. మురళీ విజయ్ (20) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయాడు. దీంతో టీమిండియా కేవలం 22 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. దీంతో క్రీజులో పుజారాకు కోహ్లీ జతకలిశాడు.
వీరిద్దరూ నిలకడగా ఆడుతూ, సాధికారిక ఆటతీరు ప్రదర్శించారు. ఈ క్రమంలో ఇద్దరూ సెంచరీలతో విరుచుకుపడ్డారు. పుజారా 204 బంతుల్లో 2 సిక్సర్లు, 12 ఫోర్లతో 119 పరుగులు సాధించి, పరుగుల గేర్ మార్చే క్రమంలో అవుటయ్యాడు. దీంతో కోహ్లీకి జత కలిసిన అజింక్యా రహనే (23) నిలదొక్కుకుంటున్న దశలో అవుటై నిరాశపరిచాడు. దీంతో విరాట్ కోహ్లీకి, రవిచంద్రన్ అశ్విన్ (1) జతకలిశాడు.
కాసేపటికే తొలి రోజు ఆటముగిసింది. దీంతో ఆటముగిసే సమయానికి నాలుగు వికెట్లు కోల్పోయిన టీమిండియా 317 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ 241 బంతుల్లో 15 బౌండరీలతో 151 పరుగులు చేయగా, అశ్విన్ జతగా ఉన్నాడు. ఇంగ్లండ్ బౌలర్లలో ఆండర్సన్ మూడు వికెట్లతో రాణించగా, బ్రాడ్ ఒక వికెట్ తో సహకారమందించాడు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more