ఇంగ్లాండ్ తో విశాఖపట్నం వేదికగా రెండో టెస్టు ప్రారంభమైంది. రెండో ఓవర్లోనే రాహుల్ రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. రెండో ఓవర్లో సువర్ట్ బ్రాడ్ వేసిన బంతితో రాహుల్ అవుటయ్యాడు. ప్రస్తుతం మురళి విజయ్, మరో ఎండ్ లో పుజారా ఉన్నారు.
ఇక కెప్టెన్ కోహ్లీ వ్యూహం మార్చి నిర్ణయం తీసుకున్నాడు. టాస్ గెలిచినప్పటికీ బ్యాటింగ్ ను ఎంచుకుని ఆశ్చర్యపరిచాడు. పిచ్ పూర్తిగా ఎండిపోయినట్టున్న నేపథ్యంలో తొలుత బ్యాటింగ్ చేసి, సాధ్యమైనన్ని ఎక్కువ పరుగులు చేయాలన్న లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కోహ్లీ తెలిపాడు.
కాగా, ఈ మ్యాచ్ లో ఓపెనర్ గౌతమ్ గంభీర్ ను రిజర్వ్ బెంచ్ కే పరిమితం చేసిన టీమిండియా కేఎల్ రాహుల్ ను తుది జట్టులోకి తీసుకుంది. మిశ్రా స్థానంలో జయంత్ యాదవ్ కు స్థానం లభించింది. దీంతో తన కెరీర్ లో తొలి టెస్టు మ్యాచ్ ఆడే అవకాశం యాదవ్ కు లభించినట్లయింది.
మ్యాచ్ ను తిలకించిన సీఎం చంద్రబాబు...
కాగా, రెండో టెస్ట్ ను తిలకించేందుకు ఏపీ సీఎం చంద్రబాబు అక్కడికి వచ్చారు. ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియం తొలిసారి ఓ అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్ కి ఆతిథ్యం ఇస్తోంది. దీంతో, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఆంధ్ర క్రికెట్ సంఘం ప్రత్యేకంగా ఆహ్వానించింది.
టీమిండియా చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ కూడా చంద్రబాబును వ్యక్తిగతంగా కలసి మ్యాచ్ తొలి రోజున స్టేడియంకు రావాల్సిందిగా కోరారు. దీంతో, ఎంతో బిజీగా ఉండి కూడా చంద్రబాబు విశాఖ క్రికెట్ స్టేడియంకు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఘన స్వాగతం పలికింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more