అవినీతి, నల్లధనంపై పోరులో భాగంగా కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై అటు బీజేపి నేతలు, ఇటు విపక్షాలు చేస్తున్న వాదనలు పూర్తిభిన్నంగా వున్నా.. ప్రజలు మాత్రం ఈ నిర్ణయం వెలువడిన 8వ తేది రాత్రి నుంచి బ్యాంకులు, ఏటీయం కేంద్రాల వద్ద బారులు తీరుతున్న వైనాన్ని చూస్తూనే వున్నాం. ఈ నోట్ల మార్పిడి కోసం బారులు తీరిన క్యూ లైన్లలో నిలబడి అసువులు బాస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతుంది.
ఈ నేపథ్యంలో కేంద్రం నిర్ణయాన్ని స్వాగతించాలా..? లేదా.. అన్న విషయాన్ని పక్కన బెడితే వేళ్ల మీద లెక్కబెట్టే శాతంలో వున్న నల్లకుబేరులెవరూ ఇప్పటి వరకు బ్యాంకుల ముందుకు మాత్రం రాలేదన్నది వాస్తవం. వారిని అరికట్టే నేపథ్యంలో సామాన్యులకు ఇబ్బందులు తప్పడం లేదన్నది కూడా అంగీకరించక తప్పని నిజం. డబ్బున్న మారాజులు ఏన్ని వివరణలు ఇచ్చినా.. పనులు మానుకుని అటు జీతం పోయి.. ఇటు బారులు తీరిన క్యూ లైన్లో వేచి తమ వంతు వచ్చే వరకు డబ్బు వస్తుందో లేదో తెలియక ఇబ్బందులు పడుతున్న వారి కష్టాన్ని ఎవరు భర్తీ చేయలేరన్నది వాస్తవం.
అయితే ఈ నోట్ల మార్పిడి కోసం సామాన్యులే కాదు, నిజాయితీ వున్న పలు రంగాలకు చెందిన ప్రముఖులు కూడా బ్యాంకులకు వస్తున్నారు. ఈ జాబితాలో జనసేన అధినేత, ప్రముఖ సినీ హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కూడా హైదరాబాదు జూబ్లీహిల్స్ లోని ఓ బ్యాంకుకు స్వయంగా వచ్చారు. అయితే సెలబ్రిటీ కావడం.. ఆయన క్యూ లైన్ లో నిలబడితే.. తమకే ఇబ్బందని భావించిన బ్యాంకు అధికారులు ఆయనను నేరుగా బ్యాంకులోకి అనుమతించారు.
దీంతో ఆయన తన వద్ద ఉన్న పెద్ద నోట్లను అధికారులకు ఇవ్వగా, వాటిని అధికారులు పరిశీలించి ఆయన అకౌంట్ లో జమచేశారు. అయితే చక్కు రూపంలో ఆయన కొంత ( 25 వేల రూపాయలు) నగదును కూడా తమతో తీసుకెళ్లినట్లు సమాచారం. అందుకు సంబంధించి పవన్ బ్యాంకులో కూర్చున్న ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మరోవైపు, బ్యాంకు వద్దకు పవర్ స్టార్ వచ్చారన్న విషయం చుట్టుపక్కల పొక్కడంతో, ఒక్కసారిగా అక్కడకు చేరుకున్న అభిమానుల తాకిడితో ఆ ప్రాంతమంతా సందడిగా మారింది. అయనను చూసేందుకు జనాలు ఎగబడ్డారు. ఇంతలో పవన్ కల్యాన్ తన పని ముగించుకుని వెళ్లిపోయారని తెలిసి అభిమానులు నిట్టూర్పవదిల్చారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more