ఏయిమ్స్ అసుపత్రిలో కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్.. Sushma undergoing treatment for kidney failure

Sushma undergoing treatment for kidney failure

sushma swaraj, sushma swaraj aiims, sushma swaraj kidney failure, sushma swaraj dialysis, sushma swaraj health, mea sushma swaraj, india news

Confirming reports of her ill health, External Affairs Minister Sushma Swaraj said she was undergoing treatment for kidney failure.

ఏయిమ్స్ అసుపత్రిలో కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్..

Posted: 11/16/2016 02:53 PM IST
Sushma undergoing treatment for kidney failure

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర కల సాకారం కావడానికి తన వంతుగా కృషి చేసిన ధీర వనిత.. ప్రస్తుత కేంద్ర విదేశాంగ శాఖ మంత్రిగా కూడా దేశప్రజలతో పాటు విదేశీ ప్రముఖల నుంచి అభినందనలు అందుకుంటున్న సుష్మా స్వరాజ్ ఏయిమ్స్ అస్పత్రిలో చేరారు. అమె అనారోగ్య సమస్యలతో క్రితం రోజున ఏయిమ్స్ ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆమెను డయాలసిస్ పరీక్షలను నిర్వహించిన వైద్యులు.. అమెకు కిడ్నీ టాన్స్ ప్లాంట్ చేసేందుకు ఏర్పాటు చేస్తున్నారు.

ఈ మేరకు సుష్మా స్వరాజ్ ఆ వివరాలను ట్విట్టర్ ద్వారా తెలిపారు. కిడ్నీ ఫెయిల్యూర్ కారణంగా ప్రస్తుతం తాను ఢిల్లీలోని ఏయిమ్స్‌లో జాయిన్ అయ్యాయని.. డయాలిసిస్ ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నట్లు చెప్పారు. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ నిమిత్తం తనకు ఏయిమ్స్ వైద్యులు పరీక్షలు నిర్వహించనున్నట్లు ట్వీట్‌లో రాసుకొచ్చారు. కృష్ణ భగవానుడి ఆశీస్సులతో తిరిగి కోలుకుంటానని సుష్మా దీమా వ్యక్తంచేశారు.

కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ ట్వీట్‌పై రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే సింధియా స్పందించారు. సుష్మా ఆనారోగ్యం నుంచి త్వరగా కోలుకోవాలన్నారు. తమ ప్రార్థనలు, భగవంతుడి ఆశీస్సులతో సుష్మ ఆరోగ్యం మెరుగవుతుందని వసుంధర రాజే తన ట్వీట్‌లో పేర్కొన్నారు. కేంద్ర మంత్రి సుష్మా త్వరగా కోలుకోవాలని టీఆర్ఎస్ నాయకురాలు, నిజామాబాద్ ఎంపీ కవిత ట్వీట్ చేశారు. వీరితో పాటు పార్టీ నేతలు, అభిమానులు, అమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sushma swaraj  aiims  kidney failure  dialysis  sushma swaraj health  mea  

Other Articles