పాత 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించి ఐదు రోజులు గడుస్తున్నా.. ప్రజల చేతుల్లో మాత్రం ఇంకా డబ్బులు అడటం లేదు. జేబుల్లో వున్న పాత నోట్లు చెల్లవు.. ఇక అందుబాటులోకి వచ్చిన కొత్త నోట్లకు చిల్లర దొరకవు.. దీంతో అంగట్లో అన్నీ వున్నా.. అల్లుడి నోట్లో.. అన్న చందంగా మారిపోయింది ప్రజల పరిస్థితి. ప్రధాని నిర్ణయంపై తొలుత సానుకూలంగా స్పందించిన ప్రజలు రోజులు గడుస్తున్న కొద్ది ఆయన నిర్ణయంపై విముఖతను వ్యక్తం చేస్తున్నారు.
తమ జేబుల్లో వున్న పాత నోట్లను మార్చుకోవాలంటే గంటల కొద్దీ బ్యాంకుల ముందు పడిగాపులు కాయాలి. ఎకౌంట్లోని డబ్బు డ్రా చేయాలన్నా ఇదే పరిస్థితి. ఇక ఏటీఎంల వద్ద పెద్ద క్యూలో నిల్చున్నా తమ వంతు వచ్చేసరికి అందులో డబ్బు ఉంటుందన్న నమ్మకం లేదు. ఇక చాలా ఏటీఎంలలో డబ్బులు లేవు. మరికొన్ని ఏటీయంలు ప్రధాని నిర్ణయం ప్రకటించిన తరువాతి రోజు నుంచి మూతబడే వున్నాయి. ఇన్ని కష్టాలు పడి కొత్త 2000 రూపాయల నోటు సంపాదిస్తే మరో సమస్య ఎదురవుతోంది.
కొత్త 2000 రూపాయల నోటును చాలా చోట్ల తీసుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు. దీనికి చిల్లర నోట్లు అందుబాటులో లేకపోవడమే కారణమని చెబుతున్నారు. కొత్త 2 వేల నోటు తీసుకుని వెళితే చిల్లర లేదని వ్యాపారులు చెబుతున్నారని, ఏం చేయాలో పాలుపోవడం లేదని ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ వాసి చెప్పారు. రద్దయిన 500, 1000 రూపాయల నోట్ల స్థానంలో కొత్తగా 500, 2000 రూపాయల నోట్లను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.
కాగా 2 వేల రూపాయల నోటు అందుబాటులోకి రాగా, 500 రూపాయల నోట్లు ఇంకా రాలేదు. దీంతో 2 వేల రూపాయల నోటు మార్చేందుకు చిల్లర సమస్య ఏర్పడింది. ప్రస్తుతం ఎక్కువగా 100, 50 నోట్లే అందుబాటులో ఉన్నాయి. 2 వేల నోటుకు సరిపడా, లేదా కాస్త తక్కువగా సరుకులు తీసుకుంటే నోటు తీసుకుని చిల్లర వాపసు ఇస్తున్నారు. అదే తక్కువ మొత్తంలో కొనేందుకు వెళితే 2 వేల రూపాయల నోటును తీసుకోవడం లేదు
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more