పెద్దనోట్ల రద్దు ప్రభావం సినిమాలపై ముఖ్యంగా టాప్ హీరోలపై ఉంటుందన్న విషయం తెలిసిందే. అయినా ఈ విషయంలో ఇప్పటికే పలువురు ప్రముఖులు మోదీ తీసుకున్న నిర్ణయంపై అభినందనలు కురిపించారు. తాజాగా, బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.
‘రూ.500, రూ.1000 నోట్ల రద్దు.. నా సినిమాలపై ప్రభావం చూపినా ఫర్వాలేదు కానీ, సామాన్య ప్రజలకు మాత్రం మేలు జరగాలి’ అన్నాడు అమీర్. పెద్దనోట్లు రద్దు కారణంగా ఆ నోట్ల మార్పిడి కోసం ప్రజలు పడుతున్న ఇబ్బందులు తాత్కాలికమేనని చెప్పాడు. క్రిస్మస్ కి దంగల్ రిలీజ్ కానుంది. మల్లయోధుడు మహావీర్ సింగ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతుందే ఈ సినిమా. గతంలో అసహనం వ్యాఖ్యలు చేయటం ద్వారా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్న అమీర్. దాని తీవ్రతను తగ్గించేందుకే ఈ వ్యాఖ్యలు చేసుంటాడని పలువురు అభిప్రాయపడుతున్నారు.
మోదీకి ఓ సలహా...
ఇక పెద్ద నోట్లను వెనక్కి తీసుకోవాలనే నిర్ణయంతో ఎక్కడెక్కడో ఉన్న బ్లాక్ మనీ బయటకు రావాలన్నదే మోదీ ఆలోచన. కానీ, ఆ డబ్బును కొందరు పడేయడం, తగలబెట్టడం లాంటివి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీకి హీరోయిన్ పూజా హెగ్డే ఓ సూచన చేసింది.
వచ్చే ఏడాది మార్చి వరకు రూ. 500, రూ. 1000 నోట్లను ప్రభుత్వ ఆసుపత్రులకు డొనేషన్ గా ఇచ్చే అవకాశం కల్పించాలని సూచించింది. దీని వల్ల ఓ మంచి కార్యక్రమానికి బ్లాక్ మనీ ఉపయోగపడినట్టు అవుతుందని చెప్పింది. అనవసరంగా డబ్బును నాశనం చేయడం కంటే... నల్లధనం కలిగినవారు ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు ఆ డబ్బును డొనేట్ చేస్తే బాగుంటుందని సూచిస్తూ ట్వీట్ చేసింది.
Instead of money getting wasted,ppl might donate,healthcare will improve.Just a suggestion @narendramodi.. https://t.co/SHMcWoWQqZ
— Pooja Hegde (@hegdepooja) November 11, 2016
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more