అన్ని కులాలు సమానమనే తాను నమ్ముతానని సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ అంటున్నాడు. అనంపురం జిల్లా గుత్తిలో నిర్వహించిన విద్యార్థులతో ఇష్టాగోష్ఠిలో ఆయన ఓ విద్యార్థిని అడిగిన రిజర్వేషన్ల అంశంపై సమాధానం చెబుతూ... రిజర్వేషన్ అనేది చాలా సున్నితమైన సమస్య అని వివరించాడు. ‘నేను ఏదైనా మాట్లాడితే అది అపార్థం చేసుకునే ప్రమాదం ఉంది. రిజర్వేషన్లు పొందలేని వారి ఆవేదన, బాధను అర్థం చేసుకోగలను. రిజర్వేషన్లతో నైపుణ్యం ఉన్న విద్యార్థులు దూరం అవుతున్నారని అంటున్నారు. అది నిజమే. రిజర్వేషన్ లేని కులాలవారు బాధపడుతున్నారు. అసెంబ్లీలో మీ ప్రశ్నను వినిపిస్తాను. పార్లమెంటులో కూడా వినిపిస్తాను. కులాన్ని గౌరవిస్తాను తప్ప నెత్తికెత్తుకోను’ అని పవన్ కల్యాణ్ అన్నారు. ప్రస్తుతం కులాలను బేస్ చేసుకునే ఎంతో మంది రాజకీయాలు చేస్తున్నారని, తాను అలాంటి వాటికి వ్యతిరేకం అని చెప్పుకొచ్చాడు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయం మంచిదేనని పవన్ కల్యాణ్ అన్నారు. దేశంలో కూరుకుపోయిన అవినీతి, నల్లధనం, నకిలీ నోట్ల నిరోధానికి ఇటువంటి నిర్ణయాలు ఉపయోగపడతాయని చెప్పారు. కట్టిన పన్నులతో ప్రభుత్వ ఆదాయం పెరిగి మళ్లీ అది జనాలకే అందితే ఎంతో సంతోషమని చెప్పారు. బ్లాక్ మనీ ప్రక్షాళన రాజకీయ నాయకుల నుంచే జరిగితే బాగుంటుందని అన్నారు. మనిషి ఆదాయానికి మించిన ఖర్చు కూడా చేయకూడదని సూచించారు.
అనంతపురం కోసం మీరు ఏం చేయగలరు అని ఓ విద్యార్థిని అడిగిన ప్రశ్నకు... తనకు పాదయాత్ర చేయాలని ఉందని తెలిపారు. పాదయాత్ర చేసే శక్తి తనకు ఉందని అన్నారు. విద్యార్థులు అడిగే అన్ని ప్రశ్నలకి ఇప్పుడు సమాధానం చెప్పలేనని పేర్కొన్నారు. అనంతపురంలోని కరవు ప్రాంతాల్లో పాదయాత్ర చేస్తానని వెల్లడించారు. అక్కడి కరవు పరిస్థితులపై అధ్యయనం చేస్తానని, ఆ తరువాత అన్ని అంశాలను సమగ్రంగా చర్చించి పోరాడతానని చెప్పారు. ఆరోజు మీరు అడిగిన అన్నింటికి సమాధానం చెబుతానని తెలిపాడు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more