దేశంలోంచి అవినీతిని పారద్రోలేందుకు సంచలనాత్మక నిర్ణయాన్ని తీసుకున్న కేంద్రంలోని మోడీ సర్కార్.. తమ నిర్ణయంతో ధరాఘాతం కూడా కిందకు దిగివస్తుందని బావిస్తుంది. దీంతో అన్ని ధరలు అదుపులోకి రావడంతో పాటు.. మళ్లీ చిన్న కరెన్సీ నోట్లు మళ్లీ తమ పూర్వ వైభవాన్ని సంతరించుకుంటాయని కూడా భావిస్తుంది. ఈ నేపథ్యంలో కేంద్రప్రభుత్వం మరో సంచలనాత్మక నిర్ణయాన్ని కూడా తీసుకుంది.
ఇప్పటికే కోత్తగా దేశ ప్రజల చేతుల్లో అలరారుతున్న రెండు వేల రూపాయల కరెన్సీనోటుతో పాటు మరికొన్ని రోజుల వ్యవధిలో ఐదు వందల రూపాయల నోటు కూడా అందుబాటులోకి రానుంది. దీంతో పాటు మరో రెండు మూడు నెలల వ్యవధిలో తాను మళ్లీ వస్తానని.. అదృశ్యమౌతున్నది కేవలం తాత్కాలికమేనని వెయ్యి రూపాయల నోటు కూడా చెబుతుంది. కొత్తగా రంగులద్దుకుని.. సరికొత్త డిజైన్ తో రెట్టింపు భద్రతా ప్రమాణాలతో అన్ని నోట్లు అందుబాటులోకి వస్తాయని కూడా తెలుస్తుంది.
అయితే ఈ సమయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు కూడా వార్తలందుతున్నాయి. ఇప్పటివరకూ ఏటీఎం లలో కనిష్టంగా వచ్చేన 100 నోటు.. ఇక నుంచి మారనుంది. ఇకపై ఏటీయంలోలో అంతకన్నా తక్కువ విలువైన కరెన్సీ నోటు కూడా అందుబాటులోకి రానుంది. అంటే ఇప్పటి వరకు వున్న మల్టీపుల్ అఫ్ 100 విధానానికి ఏటీమంలు స్వస్తి పలికి.. ఇకపై మల్టిపుల్ అప్ 50 విధానానికి శ్రీకారం చుట్టనున్నాయి.
ఈ విధానం అందుబాటులోకి రావడంతో నవంబర్ 11 అనగా, రేపటి నుంచి అన్ని ఏటీఎం సెంటర్లలో 50 రూపాయల నోట్లు కూడా అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు భారతీయ రిజర్వు బ్యాంకు అన్ని బ్యాంకులకు అదేశాలను జారీ చేసింది. ఒక్క రోజు పాటు నిలిపివేసిన సేవలతో అన్ని ఏటీయం కేంద్రాలలో ఈ మార్పులను చేయాలని అర్భీఐ బ్యాంకులకు అదేశాలను జారీ చేసింది. అయితే కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో చిల్లర కరువు కష్టాలు గట్టెక్కినట్టేనని పలువురు భావిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more