దేశంలోంచి అవినీతిని పారద్రోలేందుకు సంచలనాత్మక నిర్ణయాన్ని తీసుకున్న కేంద్రంలోని మోడీ సర్కార్.. తమ నిర్ణయంతో ధరాఘాతం కూడా కిందకు దిగివస్తుందని బావిస్తుంది. దీంతో అన్ని ధరలు అదుపులోకి రావడంతో పాటు.. మళ్లీ చిన్న కరెన్సీ నోట్లు మళ్లీ తమ పూర్వ వైభవాన్ని సంతరించుకుంటాయని కూడా భావిస్తుంది. ఈ నేపథ్యంలో కేంద్రప్రభుత్వం మరో సంచలనాత్మక నిర్ణయాన్ని కూడా తీసుకుంది.
ఇప్పటికే కోత్తగా దేశ ప్రజల చేతుల్లో అలరారుతున్న రెండు వేల రూపాయల కరెన్సీనోటుతో పాటు మరికొన్ని రోజుల వ్యవధిలో ఐదు వందల రూపాయల నోటు కూడా అందుబాటులోకి రానుంది. దీంతో పాటు మరో రెండు మూడు నెలల వ్యవధిలో తాను మళ్లీ వస్తానని.. అదృశ్యమౌతున్నది కేవలం తాత్కాలికమేనని వెయ్యి రూపాయల నోటు కూడా చెబుతుంది. కొత్తగా రంగులద్దుకుని.. సరికొత్త డిజైన్ తో రెట్టింపు భద్రతా ప్రమాణాలతో అన్ని నోట్లు అందుబాటులోకి వస్తాయని కూడా తెలుస్తుంది.
అయితే ఈ సమయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు కూడా వార్తలందుతున్నాయి. ఇప్పటివరకూ ఏటీఎం లలో కనిష్టంగా వచ్చేన 100 నోటు.. ఇక నుంచి మారనుంది. ఇకపై ఏటీయంలోలో అంతకన్నా తక్కువ విలువైన కరెన్సీ నోటు కూడా అందుబాటులోకి రానుంది. అంటే ఇప్పటి వరకు వున్న మల్టీపుల్ అఫ్ 100 విధానానికి ఏటీమంలు స్వస్తి పలికి.. ఇకపై మల్టిపుల్ అప్ 50 విధానానికి శ్రీకారం చుట్టనున్నాయి.
ఈ విధానం అందుబాటులోకి రావడంతో నవంబర్ 11 అనగా, రేపటి నుంచి అన్ని ఏటీఎం సెంటర్లలో 50 రూపాయల నోట్లు కూడా అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు భారతీయ రిజర్వు బ్యాంకు అన్ని బ్యాంకులకు అదేశాలను జారీ చేసింది. ఒక్క రోజు పాటు నిలిపివేసిన సేవలతో అన్ని ఏటీయం కేంద్రాలలో ఈ మార్పులను చేయాలని అర్భీఐ బ్యాంకులకు అదేశాలను జారీ చేసింది. అయితే కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో చిల్లర కరువు కష్టాలు గట్టెక్కినట్టేనని పలువురు భావిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 13 | తన బిడ్డ అపదలో ఉన్నాడంటే ప్రతీ తల్లి గజేంద్రమోక్ష ఘట్టంలోని శ్రీమహావిష్ణువు రూపం దాల్చి అత్యంత వేగంగా ప్రతిస్పందించి రక్షిస్తుందని అంటారు. తన బిడ్డకు ఆపద వస్తుందంటే అవసరమైతే పులితో కూడా పోట్లాడి.. తన... Read more
Aug 13 | బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రియాంక ఖర్గే చేసిన తీవ్రవ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగాలు పోందాలంటే యువకులు లంచం ఇవ్వాలి.. యువతులైతే మరో రకంగా సహకరించాలంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ప్రియాంఖ ఖార్గే... Read more
Aug 13 | దేశ స్వతంత్ర వజ్రోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏండ్లు గడుస్తున్న సందర్భంగా.. దేశప్రజలందరూ తమ ఇళ్లపై జెండాలను అవిష్కరించాలని ఇప్పటికే జెండాలను కూడా పంచిన క్రమంలో.. వాటితో తమ తమ... Read more
Aug 13 | కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న జూనియర్ ఇంజినీర్ (JE) పోస్టుల నియాక ప్రక్రియను స్టాఫ్ సెలెక్షన్ కమిటీ (SSC) చేపట్టింది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమయింది. అర్హులైనవారు వచ్చే నెల 2... Read more
Aug 13 | మరో రెండేళ్లలో దేశంలో సార్వత్రిక ఎన్నికలు రానున్నాయి. ఇప్పటి నుంచే రాజకీయ సమీకరణాలపై చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో జాతీయ మీడియా సంస్థ ఇండియా టుడే, సీ ఓటర్ సంస్థతో కలిసి చేపట్టిన జాతీయస్థాయి... Read more