నల్లధనానికి, నకిలీ నోట్లకు పెద్ద నోట్ల రద్దుకు తమ ప్రభుత్వ నిర్ణయం అడ్డుకట్ట వేస్తుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్జైట్లీ అన్నారు. తాత్కాలికంగా ఒకటి, రెండు రోజుల ఇబ్బందులను ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. అయితే రెండు రోజుల తరువాత ఎలాంటి ఇబ్బందులు ఉండవని జైట్లీ స్పష్టం చేశారు. ఢిల్లీలో ఆర్థిక శాఖ అధికారులతో కలిసి మీడియా సమావేశం ఏర్పరచి విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. కేంద్ర నిర్ణయంతో పన్నుల వసూళ్లు పెరుగుతాయని చెప్పారు. వీలైనంత త్వరగా అన్ని సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తామని అన్నారు.
దేశ ఆర్థిక వ్యవస్థకు కలిగే నష్టానికి, నల్లధనానికి చెక్ పెట్టడానికే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. నల్లధనం వల్ల ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నం అవుతుందని, అవినీతి నిరోధానికి కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుందని అన్నారు. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో దేశ ఆర్థిక వ్యవస్థ మరింత బలపడుతుందని, ఆర్థిక సంస్కరణలకు కృషి చేస్తోన్న కేంద్రం నిర్ణయాల వల్ల పేదలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తబోవని చెప్పారు. ప్రతిపక్షాలు దీనిపై కామెంట్ చేసే ముందు ఈ విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని చెప్పారు.
1978 నాటి పరిస్థితితో ఇప్పటి పరిస్థితిని పోల్చిచూడకూడదని, అప్పటి ఆర్థిక వ్యవస్థ ఇప్పటి వ్యవస్థకు తేడా ఉందని జైట్లీ చెప్పారు. కేంద్ర నిర్ణయం దేశంలోని అవినీతి పరులకు మాత్రమే నష్టమని స్పష్టం చేశారు. నల్ల బినామీ లావాదేవీలను అడ్డుకునేందుకే తాము ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. నల్లధనం, నకిలీ నోట్లను అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం పట్ల ఆందోళన అవసరం లేదని చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more