దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ ప్రారంభంతోనే కుప్పకూలాయి. నిన్న రాత్రి ప్రధాని నరేంద్రమోడీ తీసుకున్న సంచలన నిర్ణయంతో మార్కెట్లు కుదేలయ్యాయి. నల్లధనంపై సర్జికల్ స్ట్రైక్స్ గా పేర్కొంటూ తీసుకున్న నరేంద్రమోడీ ప్రభుత్వం 500, 1000 రూపాయల కరెన్సీ నోట్లను రద్దు చేస్తున్నట్లు తీసుకున్న నిర్ణయం మదుపరులకు రుచించకపోవడంతో దేశీయ సూచీలపై దాని ప్రబావం వడింది. దీనికి తోడు అమెరికా అధ్యక్ష ఎన్నికలలో ఓటర్ల అంచనాలను తారుమారు చేస్తూ డెమెక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ కంటే రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ రేసులో ముందంజలో వుండటం, రమారమి అయనకే అధ్యక్ష పగ్గాలు దక్కుతున్నట్లు ఫలితాలు వెల్లడవుతున్న నేపథ్యంలో మార్కెట్లు కుప్పకూలీపోయాయి.
ఉదయం మార్కట్లు ప్రారంభంతోనే మార్కెట్లు కుదేలయ్యాయి. సెన్సెక్స్ 1600 పాయింట్లకు పైగా కుదేలైంది. ప్రస్తుతం కొద్దిగా కోలుకున్న మార్కెట్లు కొంతమేర నష్టాలను భర్తీ చేసకున్నప్పటికీ.. దేశీయ సూచీలు ఇంకా పతనం అంచునే కోనసాగుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 998 పాయింట్ల నష్టంతో 26.579 వద్ద ట్రేడింగ్ కోనసాగిస్తుండగా, నిఫ్టీ 339 నష్టంతో 8,203గా కొనసాగుతోంది. ఇదే రకంగా ట్రేడింగ్ కోనసాగిన నేపథ్యంలో మార్కెట్లు సాయంత్రానికి ఎన్ని పాయింట్లను కోల్పోతాయి.. ఎన్ని లక్షల కోట్ల రూపాయలను హరించుకుపోతాయన్న భయం అన్ని వర్గాల్లో కోనాసాగుతుంది.
ఇక అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రభావంతో అమెరికన్ మార్కెట్లతో పాటు ఆసియా మర్కెట్లు కూడా భారీ పతనం అంచున సాగుతున్నాయి, డాలర్ విలువ కూడా పడిపోయింది. ట్రంప్ ఎఫెక్ట్తో బంగారం భగ్గుమంటోంది. బ్యాంకింగ్, ఆటో షేర్లు భారీగా నష్టాలను చవిచూస్తున్నాయి. రియాల్టీ, పవర్, ఆయిల్ అండ్ గ్యాస్, మెటల్, కన్సూమర్ డ్యూరెబుల్ స్టాక్స్ కూడా అతలాకుతలమవుతున్నాయి. ఈ ఎఫెక్ట్తో పెట్టుబడిదారుల 300 కోట్ల సంపద ఆవిరైనట్టు అర్థిక నిఫుణులు అంచనా వేస్తున్నారు
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more