లచ్చులో లచ్చన్న ఈ లుచ్చాగాళ్ల రాజ్యంలో బిచ్చగాళ్ల బతుకులాయే అన్న పాటు లో రెండో చరణం.. ప్రజల వద్ద పాలనని ఊరూరికి తిరుగుతుండ్రు.. ఎన్నడు రానీ అఫీసరు గుడిసె ముందుకు వచ్చిండు.. కడుపుల సల్ల కదలకుండా కారు మీద వచ్చిండు.. శ్రమదానం పేరుతోటి పలుగు పార పట్టిండ్రు.. అంగిస్తరు చెడకుండా తట్ట నెత్తికెత్తుకుండు.. పేపర్లో ఫోటోలకి.. (మీడియాలో కవరేజీకి) ఫోజులిచ్చి దిగుతుండ్రు.. లచ్చులో లచ్చన.. అంటూ సాగిన ఈ పాట దాసరి నారాయణ రావు దర్శకత్వంలో రూపోందించిన ఒసేయ్ రాములమ్మ సినిమాలోనిదన్న విషయం అందరకీ తెలిసిందే.. అయితే ఈ పాటలో దాసరి చెప్పినట్లుగానే టీడీపీ నేతల వ్యవహార శైలి వుందన్న వాదన అప్పడు.. ఇప్పుడు కూడా వ్యక్తం అవుతుంది, ఇందుకు కారణం కేవలం ఒకే ఒక్క ఫోటో. TDP
తాజాగా విజయవాడలో టీడీపీ నేతలకు నిర్వహిస్తున్న శిక్షణా తరగతుల వ్యవహారంలో ఇలాంటి పొరపాటే జరిగింది. పాలనకు టెక్నాలజీని ఎలా జోడించాలనే విషయమై టెక్ విద్యార్థుల చేత టీడీపీ నేతలకు అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు పాఠాలు చెప్పించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి సంబంధించిన కొన్ని ఫోటోలను టీడీపీ బయటకు విడుదల చేసింది. అయితే అసలు మానిటర్ కూడా ఆన్ చేయకుండానే.. కంప్యూటర్ పాఠాలు నేర్చుకుంటున్నట్లుగా ఉన్న టీడీపీ మాజీ ఎంపీ గద్దె రామ్మోహన్ ఫోటోపై ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజెన్లు సెటైర్లు విసురుతున్నారు.
మానిటర్ కూడా ఆన్ చేయకుండా కేవలం పబ్లిసిటీ స్టంట్స్ కోసం ఇలా ఫోటోలకు పోజులిచ్చారంటూ నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. రీస్టార్ట్ చేసి వేచి చూస్తున్నారా..? లేక సిస్టమ్ రీబూట్ అయ్యిందో తెలియదు కానీ.. తెలిసి జరిగినా, తెలియక జరిగినా మొత్తానికి టీడీపీ శిక్షణా తరగతుల వ్యవహారంపై నెటిజెన్లు మాత్రం మండి పడుతున్నారు. శిక్షణ ఇచ్చే విద్యార్థి మౌస్ పట్టుకుని గద్దె రామ్మోహన్కు టెక్ పాఠాలు చెబుతున్నట్లుగా ఆ ఫోటోలో కనిపిస్తోంది. అయితే కేవలం అది ఫోటోకు ఫోజే గానీ మానిటర్ ఆన్ చేయకుండానే పాఠాలంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు నెటిజెన్స్.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more