సింప్లిసిటీకి మారుపేరుగా నిలిచారు ఆ ప్రధాని, అది కూడా తన దేశంలో కాకుండా మరో దేశానికి పర్యటనకు వచ్చి మరీ తనకు ఎలాంటి వీఐపీ కాన్వాయ్ వాహనాల శ్రేణి వద్దని, సాధారణ బస్సులో ఆయనకోసం ఏర్పాటు చేసిన హోటల్ కు బయలుదేరి వెళ్లారు. ఇంతకీ ఎవరా ప్రధాని..? ఏమా కథ అనుకుంటున్నారా..? మన దేశంలోని పలువురు నేతలు మన దేశంలోని పలు ప్రాంతాలను ఆ దేశం మాదిరిగా అభివృద్ది చేస్తామని బడాయిలకు పోతారే అయనే.
ఆయన మరోవరో కాదు సింగపూర్ ప్రధాని లీ సైన్ లూంగ్. మన దేశంలో దైపాక్షిక చర్యలు జరిపేందుకు గాను ఐదు రోజుల పాటు పర్యటన కోసం నిన్న సాయంత్రం ఢిల్లీకి చేరుకున్న ఆయన వాహనాల శ్రేణికి బదులు బస్సులో వెళ్లి అందరినీ అశ్చర్యపర్చారు. ఒక ప్రత్యేక బస్సులో తాను బస చేయాల్సిన హోటల్కు వెళ్లిపోయారు. ఇలా బస్సులో ఓదేశ ప్రధాని రావడంతో ఆయనను స్వాగతించేందుకు వచ్చిన అధికారులు, హోటల్ యాజమాన్యం కూడా అశ్చర్యానికి లోనైంది
లూంగ్ తన ఐదు రోజుల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పాటు పలువురు కేంద్రమంత్రులతో, భారత అధికారులతో సమావేశమై చర్చలు జరుపుతారు. ప్రధానంగా భద్రత, వాణిజ్యం, పెట్టుబడుల గురించి ఈ చర్చలు ఉంటాయని అంటున్నారు. పలు ఒప్పందాలపై కూడా ఇరు దేశాల ప్రధానుల సమక్షంలో సంతకాలు జరిగే అవకాశం ఉంది. భారతదేశంలో ఉన్న సింగపూర్ వాసుల గౌరవార్థం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఏర్పాటుచేసే విందులో కూడా సింగపూర్ ప్రధాని పాల్గొంటారు. లూంగ్తో పాటు ఆయన భార్య హో షింగ్, పలువురు కీలక మంత్రులు, సీనియర్ అధికారులు వచ్చారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more